చొప్పదండి, డిసెంబర్ 12: మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రాగంపేట రేవెల్లి మినీ ట్యాంక్ బండ్లో సోమవారం ఆయన చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కులవృత్తులపై ఆధారపడి జీవించే వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కులవృత్తులను నమ్ముకున్న వారికి భరోసానిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, సర్పంచ్ గుంట రవి, సురేశ్, కొత్తూరి లింగమ్మ, మండల కో-ఆప్షన్ సభ్యుడు పాషా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దీటి మధు, ఉస్కెమల్ల మధు, దుబ్బాక మల్లేశం, భూమయ్య, నాయకులు మాచర్ల వినయ్, మామిడి రాజేశం, గాండ్ల లక్ష్మణ్, సదాశివరెడ్డి, గసికంటి కుమార్, ముదిరాజ్ కులస్థులు పాల్గొన్నారుపరామర్శ చొప్పదండి పట్టణానికి చెందిన ఆర్ఎంపీ గోపాల్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గోపాల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, నలుమాచు రామకృష్ణ, మహేశుని మల్లేశం, సీపెల్లి గంగయ్య ఉన్నారు.