చొప్పదండి, డిసెంబర్ 9: చొప్పదండిలో నూతనంగా నిర్మించిన జ్ఞానసరస్వతీ దేవాలయంలో వేదపండితుడు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో సరస్వతీదేవి విగ్రహప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం సరస్వతీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు, మహిళలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జ్ఞానసరస్వతీ సేవాదళ్ సభ్యుల సేవలను ప్రజలు అభినందించారు. కరీంనగర్ మీనాక్షి సూపర్ స్పెషాలిటీ దవాఖాన యాజమాన్యం వైద్యశిబిరం నిర్వహించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, ఎమ్మెల్యే సతీమణి సుంకె దీవెన, తహసీల్దార్ రజిత, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, అల్ఫోర్స్ విద్యాసంస్థ ల అధినేత నరేందర్రెడ్డి, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత దాసరి శ్రీపాల్రెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు, ప్రధాన అర్చకుడు సింహాచలం జగన్మోహన్స్వామి, భాష్యం నవ్య-కుమార్, సంభోజీ శేఖర్, పుల్యాల లక్ష్మారెడ్డి, గుర్రం ఆనందరెడ్డి, తిప్పర్తి శ్రీనివాస్, కుర్మాచలం రత్నాకర్, రమేశ్, కనకరాజు, వినోద్, దేవానంద్, రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, హన్మంతరెడ్డి, దండె లింగన్న తదితరులు పాల్గొన్నారు.