చొప్పదండి, డిసెంబర్ 6: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కాగా, అంబేద్కర్ చిత్రపటానికి సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూప, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, ఎంపీటీసీ బత్తుల లక్ష్మీనారాయణ, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, బందారపు అజయ్కుమార్గౌడ్, తోడేటి రత్నం, కొత్తూరి నరేశ్, దండె కృష్ణ, పెరుమండ్ల గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
రాగంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి టీ(బీ)ఆర్ఎస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కో-ఆప్షన్ సభ్యుడు పాషా, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గోపు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దీటి మధు, సింగిల్విండో డైరెక్టర్ గజ్జెల శంకర్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు సిరవేణి శ్రీకాంత్, నాయకులు మామిడి రాజేశం, ఎలిగేటి మల్లేశం, గసికంటి కుమార్, దీకొండ రమేశ్, మనోజ్ పాల్గొన్నారు.
గంగాధర, డిసెంబర్ 6: మండలంలోని బూరుగుపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. మధురానగర్లో ఎంపీపీ శ్రీరాం మధుకర్, గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలాగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, బూరుగుపల్లిలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధురానగర్లో అంబేద్కర్ సంఘం నాయకులు దోమకొండ మల్లయ్య, లింగాల దుర్గయ్య, ద్యావ శ్రీనివాస్, తాళ్ల శ్రీనివాస్, మ్యాక వినోద్, గంగాధర శంకర్, గంగాధర నగేశ్, బూరుగుపల్లిలో గడ్డం నర్సయ్య, గడ్డం స్వామి, దూలం బాలాగౌడ్, తడగొండ అజయ్, లంక హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, డిసెంబర్ 6: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ కలిగేటి కవిత, తహసీల్దార్ రాజ్కుమార్, ఎస్ఐ అంజయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోపాల్రావుపేట, వెదిర, వెలిచాల తదితర గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామడుగు సర్పంచ్ పంజాల ప్రమీల-జగన్మోహన్గౌడ్, నాయకులు కలిగేటి లక్ష్మణ్, నాగి శేఖర్, పులి ఆంజనేయులుగౌడ్, వెన్న రాజమల్లయ్య, తడగొండ హన్మంతు, గడ్డం మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, డిసెంబర్ 6: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, ఎస్కే నజియ బాబా, గండు రాంబాబు, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఫక్రూద్దీన్, నాయకులు జెర్రిపోతుల శ్రీకాంత్, గున్నాల రమేశ్, స్వర్గం నర్సయ్య, కట్ల సుధాకర్, అంబేద్కర్ సంఘం నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.