కమాన్చౌరస్తా, నవంబర్ 29: అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ టెస్ట్(అమాట్) నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అమాట్ వాల్పోస్టర్ను కరీంనగర్లోని వావిలాలపల్లి కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. గణిత శాస్త్రం ప్రధానమైన సబ్జెక్ట్ అని, వివిధ పోటీ పరీక్షల్లో విజయానికి ఉపకరిస్తుందని చెప్పారు. శ్రీనివాస రామనుజన్ గొ ప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకే యే టా ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం అమాట్ పరీ క్ష నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఈ పరీక్షను 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రెండు దఫాల్లో నిర్వహిస్తామని, మొదటి దశ డిసెంబర్ 4న ఆదివారం సంబంధిత పాఠశాలవారు వారి పాఠశాలల్లో లేదా సమీప అల్ఫోర్స్ పాఠశాలలో లేదా కళాశాలలో పరీక్ష రాయవచ్చని సూచించారు. ఈ దశలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న విద్యార్థులకు తుది దశను 18న ఆదివారం కరీంనగర్లోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో జానియర్ కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు.
ఈ దశ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 22న రామనుజన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న జాతీయ గణిత దినోత్సవ వేడుకల్లో అతిథుల చేతుల మీదు గా బహుమతులు, నగదు పారితోషికాలను ప్రదా నం చేస్తామని చెప్పారు. పోటీ పరీక్షకు హాజరైన ప్రతి వి ద్యార్థికి సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షకు ఎలాంటి రుసుం లేదని, అల్ఫోర్స్ శాఖలు ఉన్న హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ, వర్దన్నపేట, మంచిర్యాల, నిర్మల్, భైంసా, సుల్తానాబాద్, గోపాల్రావుపేటల్లో నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ప్యాడ్, పెన్, పెన్సిల్, పాఠశాల నుంచి ధ్రువీకరణపత్రం లేదా ఐడీ కార్డు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 9 గంటలకు సంబంధిత కేంద్రంలో ఉండాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొ ని గణితశాస్త్రంపై పట్టు సాధించాలని సూ చించారు. మరిన్ని వివరాలకు 91602 94441, 9398230614, 92469 34441లో సంప్రదించాలని ఆయన సూచించారు.