రామడుగు, నవంబర్28 : చొప్పదండి నియోజకవర్గంలో అక్రిడిటేషన్ కలిగిఉండి, అర్హులైన ప్రతి పాత్రికేయుడికీ ఇంటిస్థలం అందిస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి శివారులోని రైతువేదికవద్ద సోమవారం జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర మరువరానిదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బాధలను అతి సమీపంనుంచి చూసింది జర్నలిస్టులే అని గుర్తు చేశారు. సీమాంధ్ర నాయకుల పాలనను వ్యతిరేకిస్తూ, ప్రజలకు వారధిగా నిలిచిన, కలంతో సమాజ నిర్మాణానికి పాటుపడే విలేకరులను ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో విలేకరులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందువరుసలో నిలిచిందన్నారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. బోయినపల్లి మండలానికి చెందిన విలేకరులకు మంత్రి కేటీఆర్ సహకారంతో ఇప్పటికే ఇండ్ల స్థలాలను అందించామని, గంగాధర మండలంలో ఎలక్ట్రానిక్, రామడుగు మండలంలో ప్రింట్ మీడియా విలేకరులకు సంబంధించిన ఇండ్ల స్థలాలకు పూజలు చేశామన్నారు. త్వరలోనే పటాలిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన విలేకరులకు ఇంటిస్థలాలను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్రెడ్డి, డైరెక్టర్లు కొడిమ్యాల రాజేశం, బత్తిని తిరుపతిగౌడ్, శనిగరపు అనిల్కుమార్, సర్పంచ్ కోల రమేశ్, ఎంపీటీసీ వంచ మహేందర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బండ అజయ్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, వెదిర ఎంటీసీ తొరికొండ అనిల్కుమార్, వీడీసీ చైర్మన్లు నాగుల రాజశేఖర్గౌడ్, చాడ శేఖర్రెడ్డి, నాయకులు కలిగేటి లక్ష్మణ్, వీర్ల రవీందర్రావు, శనగిరపు అర్జున్, దొబ్బల మధు, లేఖరాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
చొప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ గన్మ్యాన్ రాకేశ్ నానమ్మ ఇటీవల మృతి చెందారు. సోమవారం ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ మండలంలోని వెదురుగట్టలోని రాకేశ్ ఇంటికి వెల్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీ(టీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు స్వామిరెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, న్యాలకొండ నారాయణరావు, చీకట్ల లచ్చయ్య, గాండ్ల లక్ష్మణ్ ఉన్నారు.