విద్యానగర్, నవంబర్ 24: కరీంనగర్ ప్రభు త్వ దవాఖానలో రోగులకు అందుతున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వైద్య విధా న పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ కితాబిచ్చారు. తాను తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేయగా నాడు వైద్యులు, సిబ్బంది, దవాఖాన పరిశుభ్రత అసలు బాగా లేదని, అలాంటిది ప్రస్తుతం 90 శాతం వైద్యులు, సిబ్బంది రోగులకు అందుతున్న సేవలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. జిల్లా దవాఖానాను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకే హాస్పిటల్కు వచ్చిన కమిషనర్ మొద ట క్యాజువాలిటీ వద్ద పరిశీలించి, తర్వాత ఓపీ విభాగాలను తనిఖీ చేశారు. కేస్ షీట్లను పరిశీలించి మందులు, ఇంజక్షన్లు ఇచ్చే సమయం రా యకపోవడంతో నర్సింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు రోగులకు అం దుతున్న సేవలను కేస్ షీట్లో రాయాలన్నారు. రెండో అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేయనున్న 65 పడకల ఐసీయూ నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతానికి, ఇప్పటికీ తేడా ఉందన్నారు. ప్యారామీటర్స్ ప్రకారం అంతా సవ్యంగానే సాగుతుందని తెలిపారు.
మంత్రి హరీశ్రావుకు కరీంనగర్పై ప్రత్యేక శ్రద్ధ ఉండడంతోనే దవాఖానాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా సర్కారు దవాఖానను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నా రు. మంత్రి ఆదేశాల మేరకు వారంలో మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని వైద్యశాలలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా ప్రగతిని పర్యవేక్షిస్తున్నామని, ఏ దవాఖానాలోనైనా రోగులను ప్రైవేటు దవాఖానలకు పంపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేపర్ పైన ఎక్స్రే ప్రింట్ ఇచ్చే అధునాతన వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దవాఖానాలో నాల్గో తరగతి సిబ్బంది వసూళ్లపై నర్సింగ్ సూపరింటెండెంట్లు దృష్టి సారించాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ వెంట దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ రత్నమాల, ఇంచార్జి ఆర్ఎంవో నవీన, వైద్యులు అజయ్కుమార్, చంద్రశేఖర్, నరేందర్, రవీందర్, పద్మ, వసీం, ఆఫీస్ సూపరింటెండెంట్ సుధీర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు సులోచన, విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.