కరీంనగర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మొ దటి విడుత దిగ్విజయంగా పూర్తి చేయడంతో అదే స్ఫూర్తితో జనవరి 18 నుంచి నిర్వహించాలని భా విస్తున్నది. ఈ మేరకు అధికారయంత్రాంగం ఏ ర్పాట్లు చేస్తున్నది. మొదటి విడుతలో పల్లె, పట్టణాల్లో పేద, ధనిక తారతమ్యం లేకుండా నిర్వ హించిన ఉచిత కంటి శిబిరాలకు పెద్ద సంఖ్యలో తరలిరాగా, వైద్యులు కంటి పరీక్షలు చేసి, అవసరమున్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. కంటిలో పువ్వు, శుక్లాలు ఉన్న వారికి హైదరాబాద్కు తీసుకెళ్లి శస్త్ర చికిత్సలు చేయించారు.
అత్యంత జనాదరణ
మొదటి విడుత కంటి వెలుగుకు అత్యంత జనాదరణ లభించింది. వృద్ధాప్యంతో కంటి చూపు మం దగించే వారి సంఖ్య పెరుగుతున్నది. పరీక్షలు చే యించుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేసే పరిస్థితి లేని నిరుపేదలు కండ్లు కనిపించకున్నా కా లం గడిపేస్తుంటారు. ఇలాంటి వారి కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగు పేరుతో తీసుకున్న కార్యక్రమం చీకటి మయమైన ఎందరో వృద్ధుల కళ్లల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం పథకాల్లో అత్యం త జనాదరణ పొందినదిగా నిలిచింది. గతంలో ఈ కార్యక్రమాన్ని 120 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ జనంలో వచ్చిన స్పందనను చూసి అధికారులు మరికొన్ని రోజులు కొనసాగించారు. ఆప్తాలమిస్టు, మెడికల్ ఆఫీసర్, ఇద్దరి చొప్పున డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసి సేవలందించారు. శిబిరాల్లో రోజూ 200 నుంచి 300 మందికి పరీక్షలు చేశారు. మోతె బిందువులు, ఇతర కంటి అపరేషన్లు అవసరమైన వారిని హైదరాబాద్ తీసుకెళ్లి శస్త్ర చికిత్సలు చే యించారు. అదే స్ఫూర్తితో రెండో విడుతకు కార్యచరణ రూపొందిస్తున్నారు.
మొదటి విడుతలో చేపట్టిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ కార్యచరణతో ముందుకెళ్తున్నారు. మొదటి విడుతలో ఆశించిన మేరకు సేవలు అందించినా కంటి చూపు మందగించడం, కంటి వ్యాధులు ప్రబల డం అనేది నిరంతరం జరుగుతున్నది. దీంతో ప్రభుత్వం మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన వైద్యాధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జనాభాకనుగుణంగా లక్ష్యం మేరకు ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. జిల్లాలోని కంటి వైద్య నిపుణులు, అప్తాల్మిక్ అసిస్టెంట్ల వివరాలను సేకరిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
జిల్లాలో మొదటి విడుత కంటి వెలుగులో భా గం గా 3,85,920 మందికి పరీక్షలు చేశారు. 1,07, 564 మందికి కళ్లద్దాలు అందించారు. 30,069 మందిని ఆపరేషన్ల కోసం దవాఖానలకు రెఫర్ చే శారు. కంటి శుక్లాలతోపాటు పలు సమస్యలతో 9,968 మంది బాధపడుతున్నట్లు నిర్ధారణకు వ చ్చారు. రెండో విడుత కోసం జిల్లా అధికారులు ఏ ర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు, 18 పీహెచ్సీలు, రామగుండం కా ర్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ ము న్సిపాలిటీలతోపాటు 14 మండలాల పరిధిలోని 266 పంచాయతీల్లో స్థానికంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు జనాభా వివరాలు సేకరించి ఉన్నతాధికారి ద్వారా ప్రభుత్వానికి నివే దించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. జిల్లాలో 5, 52,037 మంది జనాభా ఉండగా, మొదటి విడతలో 4,47,668 మంది లక్ష్యం కాగా, 3,29, 734 మందికి పరీక్షలు నిర్వహించారు. 44,343 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 15,570 మం దికి ఆపరేషన్లకు సిఫారసు చేశారు. మొదటి విడుతలో జిల్లాలోని 13 మండలాల్లో 3 బృం దాలు, ఒక్కో బృందానికి 15 మంది చొప్పున వైద్య సిబ్బందితో మొత్తం 300ల మంది కంటి వెలుగులో పాల్గొన్నారు. పల్లెపల్లెకూ వెళ్లేందుకు ప్రతి బృందానికి ఒక్కో వాహనం చొ ప్పున 13 వాహనాలను సమకూర్చారు. శిబిరం లో రోజుకు 250 మందికి కంప్యూటర్ పరీక్షలు నిర్వహించి, ప్రతి వ్యక్తికి సంబంధించిన పూ ర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేశారు. రెండో విడుత చేపట్టేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో..
జిల్లాలో మొదటి విడుత కంటివెలుగులో భా గం గా రూరల్ ఏరియాలో 18, అర్బన్లో 6 చొప్పున మొత్తం 24 బృందాల వైద్యులు 5,49, 029 మందికి పరీక్షలు చేశారు. పరీక్షలు చేయించుకున్న అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 75,948 మందికి రీడింగ్ గ్లాస్లు ఇచ్చారు. కంటి చూపు తీవ్రంగా మందగించినట్లు గుర్తించిన 33,470 మందికి వారికి అవసరమైన పాయింట్తో కళ్లద్దాలు రూ పొందించి, 30,125 మందికి పంపిణీ చేశారు. కంటి శుక్లాలు, కార్నియా, మెల్లకన్ను, సస్పెక్టెడ్ గ్లుమా వంటి వ్యాధులతో బాధపడుతున్న 21,862 మందిని వివిధ కంటి దవాఖానాలకు ఆపరేషన్లకు రెఫర్ చేశారు.
అందరి వివరాలు సేకరిస్తున్నాం
జిల్లాలోని 14 మండలాలు, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబా ద్ మున్సిపాల్టీల పరిధిలోని ప్రజలకు సంబంధించిన కంటి సమస్యలపై ఇప్పటికే వివరాలు ఉన్నాయి. మరికొన్ని వివరాలను సిబ్బంది సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే కార్యక్రమ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తాం. ఎక్కడెక్కడ క్యాంపులు నిర్వహించాలి?, ఎలా నిర్వహించాలి? అనే విషయాలపై అనే ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి ముందుకు వెళ్తాం.
-డాక్టర్ ప్రమోద్కుమార్, జిల్లా వైద్యాధికారి (పెద్దపల్లి)