కమాన్చౌరస్తా, నవంబర్ 14: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సోమవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక అల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. నెహ్రూ చిత్రపటానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వీ నరేందర్ రెడ్డి పూలమాల వేసి, వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెదలాలని సూచించారు. గురువులు బోధిస్తున్న విషయాలను క్రమం తప్పకుండా నేర్చుకొని ముందంజలో నిలవాలని సూచించారు. పారమిత, ఎక్స్ ఫ్లోరికా పాఠశాలల్లో విద్యార్థులు ప్రత్యేక దుస్తుల్లో హాజరై సందడి చేశారు. ఇక్కడ పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్రావు, డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. రత్నం పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. వాణీనికేతన్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, విద్యాసంస్థల చైర్పర్సన్ రేణుక హాజరై మాట్లాడారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భగవతి పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. సిద్ధార్థ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చిన్నారులుగా మారి తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రిషి ప్లే స్కూల్లో చిన్నారులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. బ్లూబెల్స్ పాఠశాలలో విద్యార్థులకు స్వయం పాలన దినోత్సవం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యాసంస్థల ప్రిన్సిపాల్ జంగ సునీత-మనోహర్ రెడ్డి అభినందించారు. సప్తగిరి పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. కోరా జాన్సన్ పాఠశాలలో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కొత్తపల్లి, నవంబర్ 14: మానేరు పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఉత్తమంగా పాఠాలు బోధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, క్రీడా పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి డీవైఎస్వో రాజవీరు పూలమాల వేసి నివాళులర్పించారు. హెచ్ఎం లీలా ప్రసాద్, కోచ్లు గణేశ్, కిష్టయ్య, పవన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, నవంబర్ 14: నగునూర్లోని ఎస్పీఆర్ పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ ఆధ్వర్యంలో బుర్ర కథ, ఒగ్గు కథతో పాటు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డాక్టర్ ఆర్ యాకయ్య, ప్రిన్సిపాల్ చొక్కారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అరుణ, శ్రీలత, షమీమ్, నాజ్, అనసూయ, శాంతమ్మ, సంజీవా చారి, శ్రీనివాస్, మమత, శంకరయ్య, ఎం శ్రీనివాస్, పీడీ శ్రీనివాస్, మల్లేశం, సరస్వతి, ఆదయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మకల్లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపాల్ బబిత విశ్వనాథన్, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, నవంబర్ 14: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామడుగు, నవంబర్ 14: మండల కేంద్రంలోని విన్నర్స్ స్కూల్, గోపాల్రావుపేట శ్రీ ప్రగతి హైస్కూల్తో పాటు పలు విద్యాలయాల్లో విద్యార్థులే గురువులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. విన్నర్స్ స్కూల్లో కరస్పాండెంట్ పంజాల జగన్మోహన్గౌడ్, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, శ్రీ ప్రగతి హైస్కూల్లో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అన్నారం కనకయ్య, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ కర్ర శ్యాంసుందర్రెడ్డి, కరస్పాండెంట్ రాధాకృష్ణ, ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, డైరెక్టర్లు భూమయ్య, శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.