హుజూరాబాద్టౌన్, నవంబర్ 9: నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా న్యాయ సేవలను అందిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డీవీ నాగేశ్వరరావు సూచించారు. బుధవారం సాయంత్రం హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో నేషనల్ లీగల్ సర్వీస్ డేను పురసరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నేషనల్ లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి డీవీ నాగేశ్వరరావు వివిధ చట్టాలు, మండల న్యాయ సేవ అధికార సంస్థ ప్రాముఖ్యతను వివరించారు.
పేదలు ఏదైనా సమస్య ఉంటే మండల లీగల్ సెల్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది కేతిరి శ్రీనివాస్రెడ్డి, న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి కుమారస్వామి బోనగిరి, వైస్ ప్రెసిడెంట్ కామని సమ్మయ్య, లోక్ అదాలత్ సభ్యులు యతిపతి అరుణ్కుమార్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఆసీఫ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.