బోయినపల్లి, అక్టోబర్ 22: ప్రభుత్వ నిధులు 550 కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి ఎమ్మెల్యేతోపాటు జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు తూతూమంత్రంగా.. సభలకు వచ్చి వెళ్లకుండా జరిగిన అభివృద్ధి, చేపట్టే పనులపై సమష్టిగా చర్చించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రగతి పనులకు నిధుల కొరత లేదన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు పచ్చదనంతో పరిశుభ్రంగా మారాయన్నారు. ఏండ్లనాటి అంటువ్యాధులు దూరమయ్యాయని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని, వారు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమధానాలు చెప్పి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. సభలో సర్పంచులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమధానాలు చెప్పా రు.
అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, పంచాయతీరాజ్ డీఈఈ సత్యనారాయణ, ఎంపీడీవో రాజేందర్రెడ్డి, సర్పంచులు గుంటి లతాశ్రీ, బూర్గుల నందయ్య, ఇల్లెందుల శంకర్, చిందం రమేశ్, అతికం లచ్చయ్య, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ, ఈడ్గు రాజేశ్వరి, కొంకటి శిరీష, ఐరెడ్డి గీత, ఉయ్యాల శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు తదితరులు ఉన్నారు.