కమాన్పూర్, అక్టోబర్ 22: మంథని నియోజకవర్గంలోని గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందు కు సాగుతున్నామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. సింగరేణి సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ను ఎంపీపీ రాచకొండ లక్ష్మి అధ్యక్షతన కమాన్పూర్ అంగడి బజార్లో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, భార త దేశ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారన్నారు. ఓనమాలు నేర్చుకునే దశలో అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు మౌలిక వసతు లు కల్పించాలనే సంకల్పంతోనే ఫర్నిచర్ కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టామని చెప్పారు. రాబో యే కాలంలో మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతామన్నారు.
నియోజకవర్గ ప్రజ లు ఆశీర్వదించి తనను 2014లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ‘మన ఊరు – మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఊరూరా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. అయితే 2018లో ప్రజలకు తనపై ఎందుకు కోపం వచ్చిందో మాత్రం అర్థం కాలేకపోయిందని, దీనిపై ఎంతో మేధో మదనం చేస్తున్నామన్నారు. ఓడినా.. గెలిచినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు.
ఇప్పుడు జడ్పీ చైర్మన్గా సీఎం కేసీఆర్ అండదండలతో నియోజకవర్గంతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నానని వివరించారు. ఇటీవల సీఎం పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులివ్వాలని తాను చేసిన విజ్ఞప్తి మేరకు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మంథ ని నియోజకవర్గాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నేటికీ అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు లేక అధ్వానంగా ఉన్నాయ ని చెప్పారు.
అలాంటి నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎంపీపీ రాచకొండ లక్ష్మి, సర్పంచ్ నీలం సరిత, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఇంతియాజ్, సర్పంచులు బొల్లపెల్లి శంకర్గౌడ్, తాటికొండ శంకర్, ఇటవేన కొమురమ్మ, కట్కం రవిందర్, కొండ వెంకటేశ్, ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్, ఎంపీడీవో విజయ్కుమార్, తహసీల్దార్ దత్తు ప్రసాద్, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్రెడ్డి కిషన్రెడ్డి, నాయకులు ఇనగంటి రామా రావు, పూదరి సత్యనారాయణ గౌడ్, మేకల సంపత్ యాదవ్, గోపాల్, రాజసాగర్, లక్ష్మి మల్లు, అనిల్ గౌడ్, గట్టయ్య, రవి, శ్రీనివాస్, సంపత్, సంతోష్రెడ్డి పాల్గొన్నారు.