రాంనగర్, అక్టోబర్ 22: ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలువాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఫ్లాగ్ డేను పురసరించుకొని శనివారం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో నిల్వ ఉంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి చికిత్స కోసం ఉచితంగా అందజేస్తామన్నారు. వివిధ రకాల చికిత్సల సందర్భంగా రక్తం కొరత ఏర్పడి అనేక మంది ఎదురొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రక్తదానం చేయడంతో అనారోగ్యానికి గురవుతామనే అపోహను నమ్మవద్దన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పేరొన్నారు. 6 నెలలకొకసారి రక్తదానం చేసినా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, పానీయాలను అందజేశారు. ఈ శిబిరంలో 101 మంది రక్తదానం చేశారు. వారందరికీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (శాంతి భద్రతలు), జీ చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీలు తుల శ్రీనివాసరావు, ప్రతాప్, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐ లు కిరణ్ కుమార్, మురళి, వైద్యులు హమీద్, శ్రీలక్ష్మి, యూనిట్ దవాఖాన అసిస్టెంట్ అబ్దుల్లా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ కమిషనరేట్ షీటీం ఆధ్వర్యంలో నగరంలో ప్లాష్ మాబ్ నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలు, బాల భవన్కు చెందిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు సైబర్ నేరాలు జరుగుతున్న తీరుపై ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు దేశ సరిహద్దుల్లోని ప్రాంతాలు, ఇతర దేశాల్లో ఉంటూ ఫోన్ల ద్వారా నేరాలకు పాల్పడి దాచుకున్న డబ్బులను దోచుకుంటున్నారని చెప్పారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పోగొట్టుకున్న డబ్బులను తిరిగి రాబట్టడం చాలా కష్టమని తెలిపారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని పేరొన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. వివిధ రకాల యాప్ల వినియోగంపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి యాప్కు రెండు అంచెల పాస్వర్డ్ను పెట్టుకోవాలని, ప్రతి 3 నెలలకొకసారి పాస్వర్డ్ను మార్చుకోవాలని సూచించారు. డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, ప్రతాప్, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, షీటీం ఇన్చార్జి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు నటేశ్, లక్ష్మీబాబు, దామోదర్ రెడ్డి, తిరుమల్, ఆర్ఐలు కిరణ్ కుమార్, మురళి, జానీమియా, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.