ధర్మపురి, అక్టోబర్22: సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు దీపావళి పండుగకు సెలవు లేకపోవడంతో ము గ్గురు విద్యార్థులు ప్రహరీ దూకి పరారయ్యా రు. కానీ, ఫేస్బుక్ పోస్టింగ్తో వెంటనే దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లిలోని ఎస్సీ గురుకుల పాఠశాలను కొద్దిరోజుల క్రిత మే ధర్మపురి మండలం మగ్గిడి గ్రామంలోకి మార్చారు. దీపావళి పండుగకు సెలవు లేకపోవడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లాలని మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన దొనకొండ వరుణ్సందేశ్ (6వ తరగతి), కొడిమ్యాలకు చెందిన భీమ తేజస్కుమార్(6వ తరగతి), గొల్లపల్లి మండలం దట్నూర్కు చెందిన బెక్కం రిశ్వంత్(5వ తరగతి) అనుకున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 4.30గంటలకు నిద్రలేచారు.
కాలకృత్యాల కోసం టాయ్లెట్స్ వైపు వెళ్లిన విద్యార్థులు అటువైపు ప్రహరీ గోడ అక్కడ కొంత భాగం కూలి ఉండడంతో అక్కడి నుంచి బయటికి వచ్చారు. రోడ్డుపై ధర్మపురి వైపు నడుచుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో జైన గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) యువజన విభాగం నాయకుడు దుర్గం రవీందర్ వాకింగ్ చేస్తూ మగ్గిడి వైపు వస్తున్నాడు. అటు వైపు వెళ్తున్న పిల్లలతో ఈ టైమ్లో ఎటూ అంటూ ప్రశ్నించాడు.
పిల్లలు కూడా వాకింగ్ అనడంతో గ్రామానికి చెందిన పిల్లలే కావచ్చునని భావించి సదరు నాయకుడు వారితో సెల్ఫీ దిగి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఆ పోస్టు చూసిన బెక్కం రిశ్వంత్ తల్లిదండ్రులు రవికి ఫోన్ చేసి ఫొటోలో ఉన్నది తమ అబ్బాయిగా చెప్పారు. వాళ్లంతా హాస్టళ్లో ఉంటారని, ఈ సమయంలో బయటకు ఎందుకు వచ్చారని రవిని అడగడంతో రవి వెంటనే అప్రమత్తమయ్యాడు. బైక్పై ధర్మపురి వైపు వచ్చి జైన శివారులో విద్యార్థులను పట్టుకున్నాడు. అయితే జరిగిన విషయాన్ని మంత్రి ఈశ్వర్ వ్యక్తిగత సహాయకులకు ఫోన్లో తెలియజేశారు.
వారు వెంటనే స్పందించి పాఠశాల టీచర్లకు సమాచారం ఇవ్వడంతో ఉపాధ్యాయు డు ప్రవీణ్, మరో ఉపాధ్యాయుడు వెంటనే అక్కడికి వెళ్లి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లారు. కాగా, ఎస్సీ వెల్ఫేర్ ఏఆర్సీ సూ ర్యప్రకాశ్ గురుకులానికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే వెల్ఫేర్ హాస్టళ్లో దసరా, క్రిస్టమస్, సంక్రాంతికి మాత్రమే సెలవులు ఉంటాయని, దీపావళికి సెలవు లేదని చెప్పారు. తల్లిదండ్రులు వచ్చినా విద్యార్థులను ఇంటికి పంపడానికి అనుమతి లేదని, అందుకే ఇలా పారిపోయే ప్రయత్నం చేశారని గురుకుల ఉపాధ్యాయులు తెలిపారు.