జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 10: పోడు భూములపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ జీ రవి ఆదేశించారు. పోడు భూములపై కలెక్టర్ రవి జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్లో పంచాయతీ సెక్రటరీలు, అటవీ శాఖ అధికారులకు సో మవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోడు భూముల సర్వేను అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని, సర్వే చేసే సమయంలో సంబంధిత యాప్లో ఫొటోను అప్లోడ్ చేయాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజుల్లోగా పూర్తి కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్రావు, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవోలు మాధురి, వినోద్కుమార్, డీపీవో నరేశ్, పంచాయతీ కార్యదర్శులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు, మన ఊరు మన బడి, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు, మున్సిపల్, ఈ-ఆఫీస్పై సంబంధిత అధికారులతో కలెక్టర్ రవి జూమ్ యాప్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, అరుణశ్రీ, ఆర్డీవోలు మాధురి, వినోద్కుమార్, కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 10: జిల్లా కేంద్రంలో స్థానిక ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బీఎస్ లత, అరుణశ్రీతో కలిసి కలెక్టర్ రవి స్వీకరించారు. దరఖాస్తులను వెంటనే పరిషరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్నవాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.