మెట్పల్లి రూరల్, అక్టోబర్ 3: వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తున్న ఓ మహిళా రైతు, ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన సంఘటన మెట్పల్లి మండలం జగ్గసాగర్లో విషాదాన్ని నింపింది. మెట్పల్లి ఎస్ఐ సదాకర్ కథనం ప్రకారం.. జగ్గసాగర్కు చెందిన డబ్బ రాజ్పాల్రెడ్డికి, బండలింగాపూర్కు చెందిన డబ్బ లావణ్య(34)తో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు బిడ్డలు. లావణ్య ఆదివారం సాయంత్రం గ్రామ శివారులో వ్యవసాయ పనులు ముగించుకొని తో ట నుంచి ఇంటికి తిరిగి వస్తోంది.
తాళ్లళ్ల ట్రాన్స్ఫార్మర్ సమీపంలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆమెను వెనుక నుంచి ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలై కిందపడిపో గా భర్త, బంధువులు చికిత్స కోసం మెట్పల్లిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మే రకు నిజామాబాద్కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందింది. తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.