మల్లాపూర్, అక్టోబర్ 3: గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన సీఎం కేసీఆర్కు పేదోళ్ల కష్టసుఖాలన్నీ స్పష్టంగా తెలుసని, వారి సంక్షేమమే లక్ష్యంగా ఆయన నాయకత్వంలోని సర్కారు కృషి చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.52 కోట్లతో 25 మంది లబ్ధిదారులతో పాటు ఐదుగురు జర్నలిస్టులకు మంజూరు చేసిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్కే దక్కుతుందని, ఇక్కడి పథకాలను వివిధ రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పరిశీలిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. విడుతల వారీగా గ్రామాల్లో అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో వినోద్కుమార్, ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో రాజశ్రీనివాస్, పీఆర్డీఈ గోపాల్, ఏఈ అన్వర్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ దేవ మల్లయ్య సింగిల్ విండో చైర్మన్ వేంపేట నర్సారెడ్డి, మండలాధ్యక్షుడు కొమ్ముల జీవన్రెడ్డి, వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్, ఎంపీటీసీలు ఆకుతోట రాజేశ్, మరిపల్లి సత్తమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్గ నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దేవర సురేశ్రావు తదితరులు పాల్గొన్నారు.