పెద్దపల్లి, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): ‘ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని భ్రమ పడుతున్నావు. రాజకీయ పబ్బంగడుపుకునేందుకే ప్రమాణాల పేరిట రాద్ధాంతం చేస్తున్నావు. పవిత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నావు. నీ తీరు నచ్చకనే పెద్దపల్లి ప్రజలు రెండుసార్లు తిరస్కరించారు.
అయినా బుద్ధి రాలేదు’ అంటూ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుపై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఫైర్ అయ్యారు. ఎలాంటి మచ్చలేని తనపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేగా వివేచనతో వ్యవహరించాలి త ప్పా, ఇమానాలు, ప్రమాణాలు అంటూ నాటకాలాడడం ఆయనకే చెల్లిందని నిప్పులు చెరిగారు.
దేవుడిపై ప్రమాణాలు చేస్తే అసత్యాలు సత్యాలు అవుతాయా అని నిలదీశారు. విజయారమణారావు తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి శాఖహారి అన్నచందంగా ఉన్నదని దుమ్మెత్తిపోశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారడం అవసరమా అని ప్రశ్నించారు. 2009లో ఒకసారి అవకాశమిస్తే నీ అరాచకాలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోయి 2014, 2018 ఎన్నికల్లో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు. ముచ్చటగా మూడోసారి ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనన్నారు.
నిజాయితీపరుడిని కాబ ట్టే తనను రెండుసార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించారన్నారు. ‘నీకు దోచుకోవడం. దాచుకోవడం అలవాటు. అదే తీరున అందరూ అవినీతి చేస్తారని అనుకుంటున్నావ్. నిజంగా నీకు చేతనైతే సాక్షాలను చూపి ఆరోపణలు నిరూపించు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలపై నీకు నిజమైన ప్రేమ ఉంటే రెండు రూపాయలకే ఇటుక అమ్మేలా పోరాటం చెయ్ మద్దతిస్తానన్నారు. చదువుకోలేదు కాబట్టి సభ్యత సంసారం తెలియదు కాబట్టి ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేసే అలవాటు పోవడం లేదని దుయ్యబట్టారు.
పవిత్రమైన ఆలయంలో అపవిత్ర రాజకీయాలు చేస్తున్న నిన్ను మల్లన్న ఎప్పటికీ క్షమించబోడన్నారు. నీవు ప్రమాణాలు చేయ డం కాదు గుళ్లో పోచమ్మని కూడా ఎత్తుకొస్తావని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే ఇసుక అమ్ముకున్నానని గుట్టలు తవ్వున్నానని నిరూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే జెం డా కూడలిలో ముకు నేలకు రాసి చెప్పులు మెడలో వేసుకో, నీ లంచగొండితనం, వక్రబుద్ధి, అబద్ధా లు, మోసాలు ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్ని కూత లు కూసినా, అబద్ధాలు ఆడిన ప్రజలు నిన్ను విశ్వసించరని, భవిష్యత్తులో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వరన్నారు. నీకు అధికారం ముఖ్యం నాకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని స్పష్టం చేశారు.
తప్పుడు మాటలు మా ట్లాడడం మానుకోకపోతే నాలుక కోస్తామని హెచ్చరించా రు. ఇసుక టెండర్లు పూర్తి కాగానే రీచ్ల సందర్శన అం టూ హడావుడి చేసి కొన్ని నెలలుగా ఎందుకు ఇం ట్లో ఉన్నావో ప్రజలకు చెప్పాలన్నారు. నువ్వు తలకిందులు తపస్సు చేసినా ప్రజలు నమ్మబోరన్నారు. సమావేశంలో ఎంపీపీలు బండారి స్రవంతి-శ్రీనివాస్, బాలాజీరావు, నూనెటి సంపత్, మోహన్రావు, రమా రాం గోపాల్రెడ్డి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఏఎం సీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్రెడ్డి, ప్రేమ్ చందర్రావు, జూపల్లి సందీప్రావు, గజవెల్లి పురుషోత్తం, పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, కొంకటి లింగమూర్తి, బొడ్డుపల్లి రమేశ్, సాతూరి రాజేశం ఉన్నారు.