మానకొండూర్ రూరల్, అక్టోబర్ 2: పూలనే దైవ ంగా భావించి పూజలు చేసే సంస్కృతి తెలం గాణ ప్రజలకు ప్రత్యేకమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని గంగిపల్లి శివారులో ఏర్పాటు చేసిన బతుకమ్మతల్లి విగ్రహాన్ని ఆదివా రం సర్పంచ్ శాలినీసాగర్, జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు పంచాయతీ ఆవరణలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల జీవనంతో మమేకమైన బతుకమ్మ పండుగ విశిష్టతను భావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం మ నందరిపై ఉన్నదన్నారు. ప్రతిఒక్కరూ కలిసిమెలిసి పండుగను సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు రంగు భా స్కరాచారి, చలిగంటి సంపత్, కరీంనగర్ కార్పొరేటర్ వాల రమణారావు, మానకొండూర్ సర్పం చ్ రొడ్డ పృథ్వీరాజ్, నాయకులు రెడ్డి సంపత్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్2: మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని రాంలీలా మైదానంలో ఈనెల5న దసరా పండుగ రోజు నిర్వహించనున్న ‘రాంలీలా..ధూంధాం’ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ తెలిపారు. ఆదివారం ఆయన ఎల్ఎండీలో ని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జబర్దస్త్ ఫేం హాస్యనటులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అలాగే వేంకటేశ్వర స్వా మి ఆలయంలో జమ్మి వేడుకలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మెన్ సిద్ధం వేణు, పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, రాంలీల ఉత్సవ కమిటీ చైర్మన్ నాయిని వెంకట్రెడ్డి, స్వామిరెడ్డి ఉన్నారు.