వాడవాడలా మహాత్ముడి జయంత్యుత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల ఆఫీసుల్లో బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీలు, సంఘాల నాయకులు కూడళ్లలోని గాంధీ విగ్రహాలవద్దకు చేరుకొని అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఆయన పోరాటపటిమను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆహింసామార్గం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.
మానకొండూర్/మానకొండూర్ రూరల్/శంకరపట్నం/ చిగురుమామిడి/తిమ్మాపూర్ రూరల్ అక్టోబర్ 2: మానకొండూర్ మార్కెట్ ఏరియా వద్ద న్యూజనరేషన్ పబ్లిక్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎన్జీపీఎస్ఓ)వ్యవస్థాక అధ్యక్షుడు బొద్దుల శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగిపల్లి జడ్పీస్కూల్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్రెడ్డి, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్గౌడ్ ఇడుమాల మచ్చగిరి, యశ్వంత్ యాదవ్ ఉన్నారు.
శంకరపట్నం మండలం కొత్తగట్టు పంచాయతీ కార్యాలయ ఆవరణలో బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ ఉమ్మెంతల సరోజన పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ మొకిరాల కిషన్రావు, ఉప సర్పంచ్ బో డ సంపత్, వార్డు సభ్యులు, నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడి ఉన్నారు. చిగురుమామిడి పంచాయతీ కార్యాలయంలో సిబ్బందిని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి సత్కరించారు. రెవెన్యూ కార్యాలయంలో డీటీ రవికుమార్, ఆర్ఐ రాజు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బొమ్మనపల్లి, రేకొండలో నిర్వహించిన వేడుకల్లో ఉప సర్పంచ్ ముకెర పద్మ, ఎంపీడీవో నర్సయ్య, సూపరింటెండెంట్ ఖాజా మొ యినొద్దీన్, మండల వైద్యాధికారి నాగ శేఖర్, సర్పంచ్ ఎంపీటీసీలు పిట్టల రజిత, కొత్తూరు సం ధ్య, విండో డైరెక్టర్ చాడ శ్రీధర్రెడ్డి ఉన్నారు. కొం డాపూర్లో బీజేపీ నాయకులు శ్రమదానం చే శా రు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మ హాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించారు. కొత్తపల్లిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్శాస్త్రీ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. మండలాధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, గొట్టె ముక్కల తిరుపతిరెడ్డి, గడ్డం అరుణ్, తదితరులు పాల్గొన్నారు.