నాయకులుకార్పొరేషన్, అక్టోబర్ 2: నగరంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బల్దియా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి మేయర్ వై సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాంపూర్లోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్లో నగరపాలక సంస్థ 67 ర్యాంక్ సాధించిందన్నారు. గాంధీ చూపిన బాటలో నడిచి 20లోపు ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తామన్నారు. బల్దియా కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, కోతిరాంపూర్లోని గాంధీ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు వాల రమణరావు, ఐలేందర్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముకరంపుర, అక్టోబర్ 2: విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో గాంధీ చిత్రపటానికి ఎస్ఈ గంగాధర్, ఉద్యోగులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. డీఈలు రాంచందర్రావు, రాజిరెడ్డి, చంద్రమౌళి, ఎస్ఏవో రాజేశం, ఏడీఈ సుధీర్కుమార్, కిరణ్కుమార్, ఈఎల్పీ రాజు, సంపత్కుమార్, మునీందర్, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
కలెక్టరేట్, అక్టోబర్ 2: మహాత్ముడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గాంధీ చూపిన మార్గంలో యువత, ప్రజలు నడిచి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా జిల్లా స్థాయి అధికారులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, డీఏవో శ్రీధర్, ఆర్డీవో ఆనంద్కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి నారాయణ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కోర్టుచౌరస్తా, అక్టోబర్ 2: జిల్లా కోర్టులో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు కరీంనగర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ సభ్యులు కొట్టె తిరుపతి, సిరికొండ శ్రీధర్రావు, పెరక శ్రీనివాస్, బెజ్జంకి శ్రీకాంత్, న్యాయవాదులు కోమాల ఆంజనేయులు, భాసర్ పటేల్, మహేందర్ రెడ్డి, కొలిపాక చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అలాగే, నగరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు, దివ్యాంగులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సుజయ్ పండ్లు పంపిణీ చేశారు. మెడికల్ ఆఫీసర్ సత్య ఆధ్వర్యంలో వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. న్యాయవాది మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, అక్టోబర్ 2: కొత్తపల్లి పట్టణంతో పాటు మండలంలో గాంధీ, లాల్బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గాంధీ, లాల్బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గాంధీ, లాల్బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు చైర్మన్ రుద్ర రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వాసాల రమేశ్, చింతల సత్యనారాయణరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు చెట్టిపెల్లి ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు ఎస్ నర్సయ్య, ఎస్కే బాబా, వేముల శేఖర్, కట్ల సుధాకర్, ఎస్కే మునావర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో గాంధీ, లాల్బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు కిరణ్కుమార్రెడ్డి, రాగి శ్రీనివాస్, రవీందర్రెడ్డి, రామస్వామి, గిరిధర్రావు, అభిషేక్రెడ్డి, జలాలొద్దీన్ అక్బర్, పవన్, శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం ఆసీఫ్నగర్లో గాంధీ విగ్రహానికి కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, సబ్బులు, శానిటైజర్లు, బెల్లం అందజేశారు. సర్పంచ్ కడారి శాంత-శ్రీనివాస్, ఎంపీటీసీ దావ కమల మనోహర్, వార్డు సభ్యులు శ్రీనివాస్, రాధా-రామచంద్రం, ఎన్ కరుణాకర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఆవరణలో గాంధీ విగ్రహానికి ఇన్చార్జి డీవైఎస్వో కిష్టయ్య, ఎస్జీఎఫ్ కార్యదర్శి కనకం సమ్మయ్య, బానోతు స్రవంతి, వేణుగోపాల్, సంపత్, చంద్రశేఖర్, రాజు, స్వామి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాంనగర్, అక్టోబర్ 2: గాంధీ జయంతిని పురసరించుకొని జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీవాణి, సీపీ సత్యనారాయణ, ఆర్డీవో ఆనంద్కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, వైద్యులు రమణాచారి, ప్రీతి హాజరయ్యారు. జైలు సిబ్బందితో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైలు పర్యవేక్షణాధికారి సమ్మయ్య, మాట్లాడుతూ గతేడాది నుంచి ఖైదీల సంక్షేమానికి తీసుకున్న చర్యల గురించి వివరించారు. న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ, ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించి సరైన మార్గంలో నడవాలని సూచించారు. జైల్లో ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జైళ్ల శాఖ అధికారులను, సిబ్బందిని అభినందించారు. భరోసా స్వచ్ఛంద ఆధ్వర్యంలో ఖైదీలకు పండ్లు అందజేశారు. ఖైదీలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ జైళ్ల అధికారి శ్రీనివాస్, అధికారులు పీ శ్రీనివాస్, రమేశ్, ఏ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ సుధాకర్ రెడ్డి, ఎల్ రమేశ్, లీగల్ ఎయిడ్ అడ్వకేట్ మహేశ్ పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, అక్టోబర్ 2: బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ పూల మాల వేసి నివాళులర్పించారు. కోతిరాంపూర్లోని గాంధీ విగ్రహానికి ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు పూలమాల వేసి నివాళులర్పించారు.