హుజూరాబాద్, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, వివిధ పార్టీల కార్యాలయాల్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్ముడి జీవితం అనుసరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం, కేసీ క్యాంపు, కన్యకాపరమేశ్వరీ ఆలయ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపం ఎదుట ఉన్న బాపూజీ విగ్రహానికి ఆర్యవైశ్యసంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హుజూరాబాద్ సబ్జైలులో నిర్వహించిన గాంధీ జయంతికి సీనియర్ సివిల్ జడ్జి డీవీ నాగేశ్వర్రావు హాజరయ్యారు. జైలర్ గణేశ్తో కలిసి గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. ఆర్డీవో కార్యాలయంలో డీఏవో జగత్సింగ్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కోమల్రెడ్డి, పోలీస్స్టేషన్లో టౌన్ సీఐ వీ శ్రీనివాస్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్కపెల్లి రమేశ్యాదవ్, అంపటి సతీశ్, ఆర్యవైశ్యసంఘం నాయకులు గర్రెపల్లి శ్రీనివాస్, కటకం శ్రీనివాస్, చందాగాంధీ, ప్రభాకర్, శ్రీకాంత్, పున్నం చందర్, వాకర్స్, ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జమ్మికుంట, అక్టోబర్ 2: మున్సిపల్ పరిధిలోని వాడవాడలా జాతిపిత మహాత్ముడి జయంతిని ప్రజలంతా ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ చౌక్లోని గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ పాలకవర్గం, ఆర్యవైశ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పూలమాలలు వేశారు. పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చందా రాజు మాట్లాడారు. మహాత్ముడి జీవిత విశేషాలను వివరించారు. స్వాతంత్య్రఉద్యమంలో ఆయన అందించిన స్ఫూర్తిని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో పట్టణ సీఐ రాంచందర్రావు, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వీణవంక, అక్టోబర్ 2: మండల కేంద్రంలోని మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయంతో పాటు అన్ని గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ వోరెం భానుచందర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది రాజేశ్, శంకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 2: వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అఖండ సూత్రయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి సర్పంచ్ జక్కన శ్రీలత, ఎంపీటీసీ మర్రి మల్లేశం, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు పమిడి లింగారావు, ఖాదీ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖండ సూత్రయజ్ఞంలో భాగంగా ఖాదీ ఉద్యోగులు, కార్యకర్తలు నూలు వడికారు. 24గంటల పాటు నూలు వడకడంలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజినీకాంత్, ఖాదీ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట అక్టోబర్ 2: రాచపల్లిలో మహాత్మాగాంధీ ఆశయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చిదురాల నగేశ్ గుప్తా ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సతీశ్, నాగరాజు, చక్రపాణి, రంగారెడ్డి, పాఠశాల హెచ్ఎంతో పాటు తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్, అక్టోబర్ 2: మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుద్దెనపల్లిలో స్వచ్ఛతా హీ సేవ వారోత్సవాల్లో భాగంగా సబ్బులు, సర్ఫ్లను ఎంపీవో రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ తాటిపెల్లి యుగేందర్ రెడ్డి పంపిణీ చేశారు. లస్మన్నపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా పారిశుధ్య కార్మికులను సర్పంచ్ కాయిత రాములు సన్మానించారు.
వారికి శానిటేషన్ కిట్లను అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీవో రాజశేఖర్ రెడ్డి, సర్పంచులు చంద శ్రీనివాస్, కొండ గణేశ్, అబ్బిడి పద్మారవీందర్ రెడ్డి, ఆవునూరి పాపయ్య, కొత్త రాజిరెడ్డి, తాటిపెల్లి యుగేందర్ రెడ్డి, లస్మన్నపల్లి ఉప సర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డు సభ్యులు రేగుల సురేశ్, కోఆప్షన్ సభ్యుడు కొట్టే వెంకట్ రెడ్డి, వీవోఏ శ్రీలత, ఆశ కార్యకర్త నిర్మల, గ్రామస్తులు పాల్గొన్నారు.