కోరుట్ల, సెప్టెంబర్ 30: రెండు కాళ్లు విరిగి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద దంపతులకు సాయం చేయాలని ట్విట్టర్లో వచ్చిన వినతికి అమాత్యుడు కేటీఆర్ రెండు నిమిషాల్లోనే స్పందించారు. ఆదుకుంటామని అభయమిచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్ మండలం భూషణ్రావు పేటకు చెందిన తోట రాజేందర్, రమ్య దంపతులు, తమ కూతురు ఆద్యశ్రీతో కలిసి గత నెల 22న బైక్పై జగిత్యాలకు బయలుదేరారు. ఈ క్రమంలో మోహన్రావు పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రాజేందర్, రమ్య కాళ్ల ఎముకలు విరుగడంతో బంధువులు కరీంనగర్లోని ఓ దవాఖానలో చేర్పించారు. శస్త్ర చికిత్సకు 15 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలుపడంతో పేదరికంలో ఉన్న ఆ కుటుంబం తల్లడిల్లుతున్నది. వీరి దీనస్థితిపై ఓ పత్రికలో కథనం ప్రచురితమవగా, దానిని కోరుట్లకు చెందిన టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు క్యాతం సృజన్ ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి ఆ దంపతులకు సాయం అందేలా చూస్తానని రిైప్లె ఇచ్చారు. తన ట్వీట్కు వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్కు సృజన్ కృతజ్ఞతలు తెలిపారు.