శంకరపట్నం, సెప్టెంబర్ 30: దళిత జనోద్ధారకుడు సీఎం కేసీఆర్ అని వైస్ ఎంపీపీ పులికోట రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం తాడికల్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు సమాన హక్కులు కల్పించి, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు అంబేద్కర్ తర్వాత సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నట్లు చెప్పారు. దళితబంధు, ఓవర్సీస్ పథకాలతో ఎందరో దళితుల బతుకులు మారుస్తున్నారని కొనియాడారు. ఆర్థిక అసమానతలు తొలగితే కుల వివక్ష కనిపించదన్నారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామంలో దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుల వివక్ష ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో బషీరొద్దీన్, గిర్దావర్ లక్ష్మారెడ్డి, ఏఎస్ఐ సుధాకర్, సర్పంచ్ కీసర సుజాత, ఎంపీటీసీ బుద్ధార్థి వరలక్ష్మి, ఉప సర్పంచ్ దుర్గం కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, దళిత సంఘాల నాయకులు కనకం శంకర్, నర్సయ్య, ఓదెలు, మహేందర్, రాజు పాల్గొన్నారు.
పచ్చునూర్లో సివిల్ రైట్స్ డే ..
మానకొండూర్, సెప్టెంబర్ 30: పచ్చునూర్ ఎస్సీ కాలనీలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ సోనియా మాట్లాడుతూ అంటరాని తనం సమాజాభివృద్ధికి అవరోధమన్నారు. గ్రామస్తులందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ సర్పంచ్ నర్మెట వసంతావీరయ్య, ఎస్సీ సంఘాల నాయకులు, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
చేగుర్తిలో..
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 30: చేగుర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చామనపల్లి అరుణ అధ్యక్షతన పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, అంటరాని తనం, కుల వివక్ష, దేవాలయాల ప్రవేశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఇక్కడ మండల రెవెన్యూ పరిశీలకులు, ఉపసర్పంచ్ గాండ్ల విజయ, దళిత సంఘాల ప్రతినిధులు గాలిపెల్లి వెంకట స్వామి, ఎల్కపల్లి మధు, జెర్రిపోతుల అశోక్, చామనపల్లి శ్రీనివాస్, కుక్కట్ల సంపత్యాదవ్, సంపత్, ప్రసాద్ ఉన్నారు.
నవాబ్పేట్లో..
చిగురుమామిడి, సెప్టెంబర్ 30: నవాబ్పేట్లో సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ అధ్యక్షతన శుక్రవారం పౌర హకుల దినోత్సవం నిర్వహించారు. ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష చట్టరీత్యా నేరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంకు స్వప్న, నాయబ్ తహసీల్దార్ రవికుమార్, ఎంపీవో శ్రావణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు, కుల సంఘ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.