సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 26: జల్సాలకు అలవాటు పడి జంటగా కూడి సిరిసిల్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసిన వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. సోమవారం ఇద్దరిని చాకచక్యంగా పట్టుకుని, వీరి నుంచి రూ.4.50లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు, ల్యాప్ టా ప్ను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. మానకొండూర్ మండలం ఊటూరుకు చెందిన వడ్డెపల్లి సత్యం 12 ఏండ్ల క్రి తం బతుకుదెరువుకు గంభీరావుపేటకు వచ్చాడు. అక్కడ బంధువులు ఉండడంతో రెండేళ్లపాటు కూ లీ పని చేశాడు. అక్కడ పని దొరక్క పోవడంతో సిరిసిల్లకు వచ్చి కూలీ పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సిరిసిల్ల లేబర్ అడ్డాకు పనికి వెళ్లగా, అ క్కడ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పలపల్లి పోతారానికి చెందిన దండుగుల లక్ష్మి పరిచయమైంది. లక్ష్మి భర్త మృతి చెందడం తో ఉపాధి కోసం సిరిసిల్లకు వచ్చింది. వీరిద్దరూ కలిసి పనికి వెళ్తూ , ఆరేళ్ల నుంచి సిరిసిల్లలోని వెం కంపేటలో ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నా రు.
సత్యం పనిచేయగా వచ్చిన డబ్బులు జల్సాలు, అవసరాలకు సరిపోకపోవడంతో చోరీలు చేయడం మొద లు పెట్టాడు. కాగా సత్యం గతంలో జైలుకు కూ డా వెళ్లి వచ్చాడు. అప్పుడప్పుడు తన వెంట లక్ష్మి కూడా వెళ్తున్నది. ఈ క్రమంలో సోమవారం దొం గిలించిన ఆభరణాలను అమ్మేందుకు సిరిసిల్లలోని పెద్దబజారుకు రాగా, సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిని విచారించగా సిరిసిల్లలో జరిగిన పలు చోరీలను ఒప్పుకున్నారని, నిం దితుడు సత్యం ప్రింగర్ ఫ్రింట్ ఆధారంగా చోరీ కేసులను గుర్తించామని ఎస్పీ వెల్లడించారు.
వీరి నుంచి 6.84 తులాల బంగారు, 272 గ్రాముల వెండి అభరణాలు, ఒక రాడ్, ఒక ఆపిల్ కంపెనీ ల్యాప్టాప్తో కలిపి సుమారు రూ.4.50 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. వీరిని రి మాండ్కు తరలించామని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్, సీఐ అనిల్కుమార్, ఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ పద్మ, పుల్కం శ్రీనివాస్, రాంగోపాల్, కానిస్టేబుల్ గోపాల్, శ్రీకాంత్ ఉన్నారు.