గంగాధర, సెప్టెంబర్ 19 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఈ అభ్యాస్’ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెటీరియల్ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని నాలుగు పాఠశాలల్లో మాత్రమే ఈ అభ్యాస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
కురిక్యాలలో ఈ అభ్యాస్ను ప్రారంభించడానికి కృషి చేసిన ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, తెలంగాణ సీఈవో ఫణిపవన్ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం కరీంనగర్కు చెందిన మంచాల శ్రీకాంత్ రూ.40 వేల విలువైన టీషర్టులను అందించగా, ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న చందూరి రాజిరెడ్డిని సన్మానించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేచినేని నవీన్రావు, ప్రధానోపాధ్యాయులు పట్టు పురుషోత్తం, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు నచ్చే టీఆర్ఎస్లోకి..
చొప్పదండి, సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మెచ్చే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని రేవెళ్లి గ్రామానికి చెందిన బీజేపీ మైనార్టీ మోర్చా చొప్పదండి మండలాధ్యక్షుడు మహ్మద్ షబ్బీర్ అలీ బూర్గుపల్లిలోని ఎమ్మెల్యే నివాసగృహంలో రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆ యనకు గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షే మ పథకాలు నచ్చే ఆయా పార్టీల ప్రజాప్రతినిధు లు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నా రు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మిగిలేది ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని, ప్రజల మద్దతు తమ ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్ర శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.