చొప్పదండి, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండిలో రూ.26 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డితో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రంథాలయాలను పట్టించుకోకపోవడంతో అవి నిర్వీర్యమైపోయాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రంథాలయాల అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేశారని చెప్పారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి నాలుగున్నరేళ్లలో లైబ్రరీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాడని కొనియాడారు.
కరీంనగర్ గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్ చేసి ఉద్యోగార్థులు, విద్యార్థులు, యువకులకు కావాల్సిన పుస్తకాలను సమకూర్చడంలో కీలకపాత్ర పోషించాడని ప్రశంసించారు. చొప్పదండిలో చిన్నగదిలో ఉన్న గ్రంథాలయానికి కొత్త భవనంతోపాటు విద్యార్థులు, యువకులకు కావాల్సిన పుస్తకాలను సమకూర్చారని కొనియాడారు. అనంతరం రవీందర్రెడ్డిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, గుంట రవి, దామెర విద్యాసాగర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, మండల కోఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నాయకులు నలుమాచు రామక్రిష్ణ, మాచర్ల వినయ్, చీకట్ల రాజశేఖర్, గాండ్ల లక్ష్మణ్, ఏనుగు స్వామిరెడ్డి, మహేశుని మల్లేశం, బత్తిని సంపత్, బీసవేని రాజశేఖర్, మావూరం మహేశ్ పాల్గొన్నారు.