చొప్పదండి, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మెచ్చే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండ గ్రామానికి చెందిన 60 మందికిపైగా కాంగ్రెస్ నాయకులు ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను మెచ్చే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేది టీఆర్ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు. ప్రజల మద్దతు టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉంటుందని తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, గుంట రవి, దామెర విద్యాసాగర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, మండల కో-ఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, చీకట్ల రాజశేఖర్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, గాండ్ల లక్ష్మణ్, ఏనుగు స్వామిరెడ్డి, మహేశుని మల్లేశం, సంపత్, రాజశేఖర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.