కార్పొరేషన్, సెప్టెంబర్ 17: జిల్లా వ్యాప్తంగా శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రధాన చౌరస్తాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. కరీంనగర్ బల్దియా కార్యాలయంలో మేయర్ వై సునీల్రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. సుడా కార్యాలయంలో చైర్మన్ జీవీ రామకృష్ణారావు జాతీయ జెండా ఎగురవేశారు. వైస్ చైర్మన్ సేవా ఇస్లావత్, సలహా కమిటీ సభ్యులు తోట మధు, ఉదారపు మారుతి, రవి తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పారమిత, ఎక్స్ ప్లోరిక, ఐరిస్ పాఠశాలల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ ఈ ప్రసాదరావు జాతీయ జెండా ఆవిషరించారు. కార్యక్రమంలో పాఠశాలల డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బస్టాండ్ ఆవరణలో ఆర్ఎం ఖుస్రోషాఖాన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. డీఆర్ఎంలు కవిత, చందర్రావు, సెక్యూరిటీ అధికారి రవీందర్, పర్సనల్ మేనేజర్ చంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, సెప్టెంబర్ 17: మారుతీనగర్లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ కళావతి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కిట్టి పార్టీ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు. వేడుకల్లో కిట్టి పార్టీ సభ్యులు సాహితి, సుజన, రజినీ, మంజుల, రాణి, సంధ్య పాల్గొన్నారు.
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ రెడ్డవేణి మధు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, డైరెక్టర్లు, కార్యదర్శి, కార్యాలయ సిబ్బంది, వ్యాపారులు, హమాలీలు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ గంగాధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పూలమాల వేశారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ జాతీయ జెండా ఎగురవేశారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ తన క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేశారు. జాతీయగీతం ఆలపించిన విద్యార్థులకు కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ముఖ్య ప్రణాళికాధికారి కొమురయ్య, అధికారులు పాల్గొన్నారు.
న్యాయవాదుల సమైక్యతా ర్యాలీ
కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, సభ్యులు కొట్టె తిరుపతి, పెరుక శ్రీనివాస్, బెజ్జంకి శ్రీకాంత్, సిరికొండ శ్రీధర్ రావు, మాజీ అధ్యక్షులు రఘునందన్ రావు, కొరివి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కార్యాలయంలో సీఈవో సత్యనారాయణ రావు జెండా ఎగురవేశారు. జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, డీజీఎంలు సుమమాల, వేణుగోపాల్రావు, ఏజీఎంలు శైలజ, స్రవంతి, రమేశ్, రవికుమార్, పీఏసీఎస్ డెవలప్మెంట్ సేల్స్ రీసోర్స్ పర్సన్ జీ సత్యనారాయణ, యూనియన్ అధ్యక్షుడు హన్మంతరావు, మేన్ బ్రాంచి మేనేజర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో చైర్పర్సన్ కనుమల్ల విజయ జెండా ఆవిష్కరించారు. జడ్పీ సీఈవో ప్రియాంక, జడ్పీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల జెండా ఆవిష్కరించారు. ఏవో నజీముల్లాఖాన్, వైద్యులు నవీనా, పద్మ, అలీం, కార్యాలయ సూపరింటెండెంట్ పుల్లెల సుధీర్, భీంరావు, భాస్కర్, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ శరణ్య జెండా ఆవిష్కరించారు. సూపర్వైజర్ చంద్రలీల, స్టాఫ్ నర్సు సుజాత, రాజు, ఫార్మసిస్టు అనిత, ఏఎన్ఎంలు ఉమ, రమ, సంకీర్తన, భాగ్య, అకౌంటెంట్ శ్రీదేవి, ఆశ కార్యకర్త రజినీ పాల్గొన్నారు. జ్యోతినగర్లోని జిల్లా సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సముద్రాల జనార్దన్ రావు జెండా ఎగురవేశారు. సంఘం ఉపాధ్యక్షులు ఆరెపల్లి కొమురయ్య, తోట లక్ష్మణ్ రావు, కార్యవర్గ సభ్యులు పీకేజీ స్వామి, రాజమణి, మర్రిపల్లి మహేందర్, మర్రి రాజేందర్, కఠారి రాజేంద్ర ప్రసాద్, సుధీర్ సింగ్, సత్యనారాయణ రాపర్తి వెంకటేశ్వర్లు, నారాయణ పాల్గొన్నారు.