చొప్పదండి, సెప్టెంబర్ 17: మండలంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గుర్రం నీరజ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిలుక రవీందర్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రజిత, ఆయా పార్టీల కార్యాలయాల్లో అధ్యక్షులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
బూరుగుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండా ఎగురవేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచీగా మారిందన్నారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతామని ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. పార్లమెంట్ భవనానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఆ దిశగా పోరాటం చేయాలన్నారు. కాగా, ఎంపీపీ శ్రీరాం మధుకర్, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, సీడీపీవో కస్తూరి, ఎస్ఐ రాజు వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
రామడుగు, సెప్టెంబర్ 17: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కలిగేటి కవిత, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో యాస్మిన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్పై ఎస్ఐ అంజయ్య, మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం ప్రభాకర్, గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ మామిడి తిరుపతి, రామడుగు, గోపాల్రావుపేట పీహెచ్సీల్లో వైద్యాధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో ప్రధానోపాధ్యాయులు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, నాయబ్ తహసీల్దార్ కుతుబొద్దీన్, ఆర్ఐ బాలకిషన్, సీనియర్ అసిస్టెంట్ శంకర్, జూనియర్ అసిస్టెంట్ స్వర్ణలత, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, వైస్ ఎంపీపీ పూరెల్ల రాజ్గోపాల్, సింగిల్ విండో వైస్ చైర్మన్ గంట్ల రవీందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ రజబ్ అలీ, ఏపీవో రాధ, ఎంపీటీసీ వంచ మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు, ఏఈవోలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని ఓసీ జేఏసీ కార్యాలయంలో ఓసీ సామాజిక సమాఖ్య సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఓసీ జేఏసీ నాయకులు దీపక్ బాబు, కరుణాకర్రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.
తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య జెండా ఎగురవేశారు. ఎంపీటీసీ అంకమల్ల శ్రీనివాస్, ఎంపీడీవో సంపత్కుమార్, ఏపీవో శోభ, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, ఏఈ రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. చెర్లభూత్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి జెండా ఆవిష్కరించారు. ఉపసర్పంచ్ చిట్కూరి శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎలబోతారంలో సర్పంచ్ కట్ల లక్ష్మి, నల్లగుంటపల్లిలో సర్పంచ్ సంతోష జాతీయ జెండా ఎగురవేశారు. ఉపసర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగునూర్లోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీహరి అధ్యక్షతన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సమత, సిబ్బంది మోహన్రావు, డాక్టర్ ఎస్ సుష్మ, స్టాఫ్ సెక్రటరీ రోజారమణి, కల్చరల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జోసిలీనా, అధ్యాపకులు పాల్గొన్నారు.
చామనపల్లిలో సర్పంచ్ బోగొండ లక్ష్మి జాతీయ జెండా ఆవిష్కరించారు. నైజాం విముక్తి స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి జిల్లా సభ్యులు కడారి అనంతరెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, గసిరెడ్డి జనార్దన్రెడి, మారుతి రెడ్డి, శ్రీకాంత్, రమణారెడ్డి, తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ దావు నిర్మల, బోగొండ ఐలయ్య, దావు ప్రభాకర్, దూడం మహేశ్, మల్లేశం, లింగమూర్తి, మధు పాల్గొన్నారు. గోపాల్పూర్లోని మురళీకృష్ణ ఆలయ చౌరస్తాలో యువకులు జాతీయ జెండాను ఎగురవేశారు. యువకులు ఊరడి శివారెడ్డి, పునిందర్, రమేశ్, వేణు, రాజయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ రమణారెడ్డి, ఆరిఫ్, దేవిక, శాలిని, కోమల రాజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రుద్ర రాజు జెండా ఆవిష్కరించి, మాట్లాడారు. వజ్రోత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, జెర్రిపోతుల అంజలి, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయ, ఎస్కే బాబా, స్వర్గం వజ్రాదేవి, గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, వేముల కవిత, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ ఫక్రుద్దీన్, ఎస్కే షహనాజ్, కట్ల మమత, చెట్టిపెల్లి ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లోని టీఎన్జీవోస్ ఫంక్షన్హాల్ ఆవరణలో సంఘం జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఎల్ఎండీ కాలనీలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్రెడ్డి, ఈఎన్సీ శంకర్, డీటీసీ చంద్రశేఖర్గౌడ్, ఈఈ రమేశ్, సంఘం మాజీ సభ్యులు ఎంఏ హమీద్, రాజయ్యగౌడ్, నాయకులు రాగి శ్రీనివాస్, కిరణ్కుమార్రెడ్డి, రాజేశ్ భరద్వాజ్, రామస్వామి, తిరుమల్రావు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని మానేరు పాఠశాలలో జాతీయ పతాకాన్ని విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహనీయుల వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం బాధ్యులు జనార్దన్రెడ్డి, రమేశ్రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.