జమ్మికుంట, సెప్టెంబర్ 16: నియోజకవర్గ కేంద్రం హుజూరాబాద్లో శుక్రవారం నిర్వహించిన సమైక్యతా ర్యాలీ, సభకు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో పలు వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు. అంతకుముందు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని మున్సిపల్ చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీ, సభకు మండలంలోని 18 గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు. అంతకుముందుగా ఆయా గ్రామాల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సభకు వెళ్లిన వారికి అధికారులు భోజన వసతి కల్పించారు. ఇక్కడ తహసీల్దార్ మాధవి, ఇన్చార్జి ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం రమాదేవితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు.
నియోజకవర్గ కేంద్రం హుస్నాబాద్లో నిర్వహించిన సమైక్యతా ర్యాలీ, సభకు మండలం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు భారీగా తరలి వెళ్లారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు.
హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీ, సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, వాహనాల్లో బయలుదేరారు.
హుజూరాబాద్లో సమైక్యతా ర్యాలీ, సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కో ఆప్షన్మెంబర్ హమీద్, వైస్ ఎంపీపీ లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, మండలాధ్యక్షుడు కాసం వీరారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం కొమురయ్య, అధికారులు పాల్గొన్నారు.