తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్16: మానకొండూర్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సమైక్య సంఘాల సభ్యులు సభకు బస్సుల్లో తరలివెళ్లగా.. సర్పంచులు, పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు.
గన్నేరువరం నుంచి..
ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో మానకొండూర్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవానికి మండలంనుంచి గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
మానకొండూర్ నుంచి..
మండలంలోని కొండపల్కల, ముంజంపల్లి, వేగురుపల్లి, ఊటూర్, వెల్ది, దేవంపల్లి, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, శ్రీనివాస్నగర్, రంగపేట, పచ్చునూర్ గ్రామాల నుంచి వజ్రోత్సవాలకు తరలివెళ్లారు. కొండపల్కల నుంచి 150 మంది మహిళలతో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తరలివచ్చారు. ఇక్కడ ఆర్బీఎస్ కన్వీనర్ కడారి ప్రభాకర్, మండల మహిళా అధ్యక్షురాలు బొంగోని రేణుక, బీసీ సెల్ అధ్యక్షుడు కొలిపాక రాయమల్లు, మెంగని శ్రీనివాస్, దాసరి రాజ్కుమార్, పిట్టల శ్రీనివాస్, బండి కనకయ్య, నల్లగొండ తిరుపతిగౌడ్, సంపత్, గట్టు రాయమల్లు ఉన్నారు.
రేకొండలో ..
చిరుగుమామిడి, సెప్టెంబర్ 16: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రేకొండలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ చాడ ప్రభాకర్రెడ్డి విగ్రహానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి, నివాళులర్పించారు. ఇక్కడ సీపీఐ జిల్లా కన్వీనర్ బోయిని అశోక్, నాయకులు సమ్మయ్య, కొండయ్య, రమణారెడ్డి పాల్గొన్నారు.
మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.