కమాన్చౌరస్తా, ఆగస్టు 18: బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డప్పు చప్పుళ్లు, ఒగ్గుడోలు ప్రదర్శనల మధ్య గౌడ సంఘం నాయకులు రాంనగర్లోని మార్క్ఫెడ్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా మానేరు వంతెన పైగల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీని కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు ప్రారంభించారు.
పాపన్న గౌడ్ విగ్ర హం వద్ద జరిగిన జయంతి వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ గౌడ్, మానకొండూర్ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని, వచ్చే ఏడాదిలోగా ఆయన విగ్రహ ఏర్పాటు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పలువురు వక్తలు సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను కొనియాడారు. గౌడ కులంలో పుట్టి వీరత్వానికి ప్రతీకగా నిలిచాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ్ సంఘం నాయకులు గణగాని (కలర్) సత్తన్న గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్లు కోటగిరి భూమా గౌడ్, చల్ల శారద, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాయకులు నాగుల కనకయ్య గౌడ్, జకుల మల్లేశం గౌడ్, పెంటయ్య గౌడ్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, రమేశ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పరశురాం గౌడ్, నర్సయ్య గౌడ్, కట్ట సత్తయ్య గౌడ్, ఆరే రవి గౌడ్, శ్యామ్ గౌడ్, మురళి గౌడ్, కిరణ్ గౌడ్, హరీశ్ గౌడ్, తిరుపతి గౌడ్, సుదర్శన్, జీఎస్ ఆనంద్, సత్యం తదితరులు పాల్గొన్నారు. అలాగే, జిల్లాకు చెందిన పలువురు అధికారులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.