చమోలీ: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి, జనజీవనం అస్తవ్యస్తమైంది. దేవాల్-వాన్ మోటార్ మార్గంలో గ్రిమిగాడ్ సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో స్థానికులు అత్యవసర రాకపోకల కోసం ప్రాణాలను పణంగా పెట్టి జేసీబీ బకెట్లలో ప్రయాణిస్తున్నారు. ఆపరేటర్ ఏ చిన్న పొరపాటు చేసినా, లేదా అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.