గంగాధర, ఆగస్టు 14: మండలంలోని బూరుగుపల్లిలో ఆదివారం వజ్రోత్సవాలు మిన్నంటాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బూరుగుపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి పటాకులు కాల్చి, సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వజ్రోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ శ్రీరాం మధుకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేచినేని నవీన్రావు, వెల్మ శ్రీనివాస్రెడ్డి, పులి వెంకటేశ్గౌడ్, నాయకులు సాగి మహిపాల్రావు, పునుగోటి కృష్ణారావు, గడ్డం చుక్కారెడ్డి, అట్ల రాజిరెడ్డి, రాజేశం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గంగాధర, ఆగస్టు 14: మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారు. ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని గట్టుభూత్కూర్ బురుజు, గంగాధర గ్రామ పంచాయతీ కార్యాలయం, తాడిజెర్రిలోని రావి చెట్టుకు లైటింగ్ ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో త్రివర్ణ శోభితంతో గ్రామస్తులకు కనువిందు చేస్తున్నాయి. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ధర్మ ప్రచారకర్తకు సత్కారం
రామడుగు, ఆగస్టు 14: మండలంలోని గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో ధర్మజాగరణ సంస్థ ఆధ్వర్యంలో ధర్మ ప్రచారకర్త దొనపాటి సీతారాంరెడ్డిని మాజీ సర్పంచ్ ఎడవెల్లి నర్సింహారెడ్డి శాలువాతో సత్కరించారు. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ పంతగాని రమేశ్కు మెడికల్ కిట్ అందజేశారు. ధర్మజాగరణ సంస్థ సమన్వయకర్త పాకాల రాములుగౌడ్, ఎడవెల్లి మహిపాల్రెడ్డి, పోచంపల్లి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.