కార్పొరేషన్, ఆగస్టు 14: టీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, బడుగు, బలహీన వర్గాలు, బీసీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. పద్మశాలీ సంఘానికి అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. నగరంలోని సీతారాంపూర్లో రూ.75 లక్షలతో నిర్మించిన పద్మశాలీ సంఘం హాస్టల్ భవనాన్ని ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై.సునీల్రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి కుల సంఘానికి ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం హైదరాబాద్ నడిబొడ్డున స్థలాన్ని కేటాయించడంతో పాటు భవనాల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు. 75 ఏళ్లుగా ఈ ఆలోచన ఏ ప్రభుత్వానికీ, ఏ నాయకుడికీ రాలేదని పేర్కొన్నారు. పద్మశాలీ సంఘానికి తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నదన్నారు. ప్రతి కుల సంఘానికీ ఆత్మగౌరవ భవనం ఉండాలని సీఎం కేసీఆర్ 2014లోనే ఆలోచించారని, కొన్ని సాంకేతిక ఇబ్బందులతో అమలు కాలేదని చెప్పారు. కొన్ని కుల సంఘాల మధ్య ఐక్యత లేకపోవడంతో ఇబ్బందులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు సమస్యల పరిషారానికి మంత్రి గంగుల కమలాకర్ ఎంతో కృషి చేశారని అభినందించారు.
ప్రతి కుల సంఘానికీ ఒకే విధంగా స్థలం, నిధులు కేటాయించారని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అన్ని కుల సంఘాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలకులెవరూ కుల సంఘాలకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కులవృత్తుల రక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పద్మశాలీ సంఘం నాయకులు రమేశ్, సత్యనారాయణ, గడ్డం శ్రీరాములు పాల్గొన్నారు.