కరీంనగర్ కోర్టు చౌరస్తా, ఆగస్టు 13 : న్యాయవాదులకు అండగా ఉంటానని, సమస్యల పరిషారానికి ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై, జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో అరగంట పాటు సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చిరకాల డిమాండ్ అయిన ఇండ్ల స్థలాలపై త్వరలోనే కలెక్టర్, న్యాయవాద ప్రతినిధుల సమక్షంలో తాను చర్చించి పరిషారం చూపుతానని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల కోసం నిర్మించే భవనానికి 20 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, అందులో భాగంగా కరీంనగర్ పట్టణాన్ని జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని, వాటికి నిదర్శనమే మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన, ఐటీ టవర్ అని చెప్పారు. ఇలాంటివి భవిష్యత్ తరాల వారికి మనం ఇచ్చే ఆస్తి అని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ సంఘం సభ్యులు పీవీ రాజ్ కుమార్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కొట్టే తిరుపతి, పెరుక శ్రీనివాస్ , సిరికొండ శ్రీధర్ రావు తిరుమల, అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.