కొత్తపల్లి, ఆగస్టు 13: జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని మేయర్ యాదగిరి సునీల్రావు పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి టవర్సర్కిల్ వరకు శనివారం అధికారులు, ఉద్యోగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్అండ్గైడ్స్, విద్యార్థులతో కలిసి తీసిన ర్యాలీని ఆయన సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. వజ్రోత్సవ ర్యాలీ వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగింది. క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు వజ్రోత్సవాలను దిగ్విజయం చేసిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈనెల 16న ఏకకాలంలో నిర్వహించే జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్, డీవైఎస్వో రాజవీరు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, టీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 13: కొత్తపల్లి పట్టణంలోని మార్కెట్ నుంచి కట్టె మిషన్ మీదుగా హైస్కూల్ వరకు మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు ఆధ్వర్యంలో వజ్రోత్సవ ర్యాలీ తీశారు. ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, గున్నాల విజయ-రమేశ్, గండు రాంబాబు, ఎస్కే నజీయా బాబా, చింతల సత్యనారాయణరెడ్డి, మెప్మా అధికారులు, ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఆగస్టు 13: నగరంలోని వేదం పాఠశాలలో వజ్రోత్సవ ర్యాలీ, జాతీయ జెండాలు ఆవిషరించారు. విద్యార్థులు 75 ఆకృతిలో కూర్చొని ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, ఆగస్టు 13: నగరంలో వరుణ్ మోటార్స్ ఉద్యోగులు తమ వాహనాలతో వజ్రోత్సవ ర్యాలీ తీశారు. ఎస్సారార్ కళాశాల నుంచి కోర్టుచౌరస్తా మీదుగా గీతాభవన్ వరకు ర్యాలీ తీశారు. సంస్థ జిల్లా మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేషన్/రాంనగర్/కలెక్టరేట్, ఆగస్టు 13: ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల సత్ప్రవర్తనతో మెదులుతూ నీతి నిజాయితీకి చిరునామాగా నిలువాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ సూచించారు. నగరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు వజ్రోత్సవ ర్యాలీ తీశారు. కమిషనరేట్ కేంద్రం వద్ద ర్యాలీని సీపీ వీ సత్యనారాయణ ప్రారంభించి, మాట్లాడారు. ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించి రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కమిషనరేట్ కేంద్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, వన్ టౌన్, కమాన్ మీదుగా తిరిగి ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్, ఐబీ గెస్ట్ హౌస్, కోర్టు చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు చేరుకుంది. ట్రాఫిక్ ఏసీపీ విజయ్కుమార్, ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జున రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర కారాగారంలో..
రాంనగర్, ఆగస్టు 13 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర కారాగారంలో త్రివర్ణ రంగుల బెలూన్లను జైలు అధికారులు ఆకాశంలోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా జైలు పర్యవేక్షణాధికారి జీ సమ్మయ్య, జిల్లా సబ్ జైళ్ల అధికారి శ్రీనివాస్, జైలు వైద్యాధికారి జీ రమేశ్, సీపీ సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ఈనెల 16న జరిగే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతి ఒకరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెదలాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, జైలు అధికారులు పాల్గొన్నారు.