తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 13: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ భరోసానిస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తాండ్ర పావనికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో శనివారం లబ్ధిదారు తల్లి అమృతకు ఎమ్మెల్యే చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.