కలెక్టరేట్, ఆగస్టు 13 : ఎంసెట్-2022 ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. వందలాది మంది విద్యార్థులు అత్యద్భుత మార్కులతో ర్యాంకుల పంట పండించారు. 218 మంది 10వేల లోపు ర్యాంకులు సాధించి, విద్యారంగంలో కరీంనగర్కు పేరు ప్రతిష్టలు సాధించిపెట్టారు. శుక్రవారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో తుమ్మల శ్రీవాణి 221వ ర్యాంకు, ఏ శివాత్మిక 230, ఎం రుషిధర్ 294, ఎం సాత్విక్ 409, కే వర్ష 613, హమ్జా అసద్ 627, బీ నిఖిల 672, ఎం సాయిప్రణయ్ 709, సీహెచ్ రాజావిఘ్నేశ్ 1032, సీహెచ్ సాయిశివచరణ్ 1147, సీహెచ్ మనీషా 1151, డీ కార్తికేయ 1176, ఆర్ రిష్మిత 1219, సిద్రా జరీన్ 1240, వినోద్రావు 1252, అఫీపా అహ్మద్ 1352, సీహెచ్ శార్వాణి 1415, కేవీవీఎస్ రష్మిత 1421, ఎం జ్ఞానద 1466, జే విజయ్సాత్విక్ 1505, సీహెచ్ నిష్క్రాంత్రెడ్డి 1509, డీ విశ్వనాథ్రెడ్డి 1564, కే రష్మీసాధన 1583, ఏ శ్రీజ 1585, పీ స్నేహిత 1630, బీ నవదీప్ 1662, నబీహా 1737, ఎం అశ్విత 1761, ఏ దీపిని 1769, సిద్రాఐమన్ 1809, సాయినిషిత 1824, ఎం సాకేత్రెడ్డి 1850, జీ లిఖిత 1860, ఎస్ శ్రావ్య 1873, పీ సాయికౌశిక్ 1878, సీహెచ్ విజయ్వర్మ 1893, ఎస్ కారుణ్య 1901, వీ సంజీవిని 1934, ఎం జాగృతి 1937, ఏ అక్షయరెడ్డి 1943, కే లావ్య 1951 ర్యాంకులు సాధించారు.
అలాగే 41 మంది విద్యార్థులు 2వేల లోపు, 100 మంది 5వేల లోపు, 218 మంది విద్యార్థులు 10వేల లోపు ర్యాంకులు సాధించారు. ర్యాంకులు పొందిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి కరీంనగర్లోని అల్ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యధిక, అత్యద్భుత ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈనెల 8న ప్రకటించిన ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో కూడా చారిత్రాత్మక విజయం సాధించారని గుర్తు చేశారు. ఐఐటీ అడ్వాన్స్డ్కు 400 మంది విద్యార్థులు అర్హత సాధించి సంచలనం సృష్టించారని వెల్లడించారు.
పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, అధ్యాపకుల పర్యవేక్షణ, విద్యార్థుల కృషితో కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా మార్కులు, ర్యాంకులు వస్తున్నాయన్నారు. రాబోయే నీట్ ఫలితాల్లో కూడా మహోన్నత ర్యాంకులు సాధించి, జిల్లాను తెలంగాణకే తలమానికంగా తీర్చిదిద్దడంలో తమవంతు కృషి చేస్తామన్నారు. కామర్స్ విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచి సివిల్స్ అకాడమీ ప్రారంభిస్తామని తెలిపారు. ఎంబీబీఎస్లో సీటు సాధించడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న విద్యార్థుల కోసం లాంగ్ టర్మ్ శిక్షణ ప్రారంభించినట్లు చెప్పారు.
లెక్చరర్స్ ఎంకరేజ్మెంట్తోనే ..
కాలేజీలో లెక్చరర్లు అందించిన ఎంకరేజ్మెంట్తోనే నేను రాష్ట్ర స్థాయిలో 221వ ర్యాంకు సాధించా. చైర్మన్ సర్తో పాటు లెక్చరర్స్ కూడా నిరంతంర డౌట్స్ క్లారిఫై చేస్తూ మరింత ఎంకరేజ్ చేశారు. చెప్పిన పాఠ్యాంశాలపై ప్రతి రోజు రివ్యూ చేస్తూ, అర్థం కాని క్లాసులను తిరిగి చెప్పడంతో లక్ష్యాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యా.
–టీ శ్రీవాణి 221 ర్యాంకు
ప్లానింగ్తో చదవడం వల్లే..
లెక్చరర్ల సూచనలు, ప్లానింగ్తో చదవడంతోనే నేను 294వ ర్యాంకు సాధించా. డైలీ చదువుతూ, అర్థం కాని టాపిక్లపై అడిగి తెలుసుకున్నా. ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకున్నా. దాంతో గోల్ చేరుకోవడం నాకు సులువైంది.
– ఎం.రిషిధర్, 294వ ర్యాంకు