కోర్టుచౌరస్తా, ఆగస్టు 13: లోక్అదాలత్తో కేసులు సత్వరం పరిషారమవుతాయని కరీంనగర్ రెండో అదనపు జిల్లా జడ్జి ఎం వాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. రాజీ ద్వారా ఇరు వర్గాల వారు తమ కేసులు పరిషరించుకుంటే ఇరువురు సంతోషంగా ఉంటారని తెలిపారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి మాట్లాడుతూ, లోక్ అదాలత్లో రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ, లోక్ అదాలత్లో కేసుల పరిషారానికి పోలీసు, ఇతర సిబ్బంది చూపే చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సుజయ్ మాట్లాడుతూ, లోక్అదాలత్తో ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ మదన్లాల్, మెజిస్ట్రేట్ శ్రీనిజ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజిరెడ్డి, బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 15829 కేసులు పరిషరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ తెలిపారు. వీటిలో క్రిమినల్ కేసులు 15,781, సివిల్ కేసులు 43, ఫ్రీ లీగల్ కేసులు 5 ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్లో ఎకువ కేసుల పరిషారంలో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపారు.