చొప్పదండి, ఆగస్టు 11: ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తిని చాటిచెప్పాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఐ రవీందర్, ఎస్ఐ ఉపేంద్రాచారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 2కేరన్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటిచెప్పాలన్నారు. శుక్రవారం రక్షాబంధన్ను మహిళా సంఘాల సభ్యులు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఝాన్సీ విద్యాలయం నుంచి ప్రారంభమైన 2కేరన్ అంబేద్కర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా మీదుగా సాగి వ్యవసాయమార్కెట్లో ముగిసింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, వైస్చైర్మన్ కొత్త గంగారెడ్డి, కమిషనర్ శాంతికుమార్, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, కొట్టె అశోక్, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్కుమార్, గాండ్ల లక్ష్మణ్, బత్తిని సంపత్, చీకట్ల రాజశేఖర్, గంగయ్య పాల్గొన్నారు.
మధురానగర్, గర్శకుర్తి గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భాస్కర్రావు, ఎస్ఐ రాజు, గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచ్ అలువాల నాగలక్ష్మి, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, నాయకులు వేముల అంజి, అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, దూస అనిల్, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ నిర్వహించి, మొక్కలు నాటారు. ఇండ్లపై జెండాలను ఎగురవేశారు.
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఫ్రీడం రన్ నిర్వహించారు. ఎంపీపీ కలిగేటి కవిత, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, సర్పంచ్ పంజాల ప్రమీల, తహసీల్దార్ రాజ్కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద, ఏపీవో రాధ, వైద్యాధికారి రజిత, ఎంపీవో సురేందర్, ఏఎస్ఐ గౌస్ఖాన్, వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ బైపాస్లోని విట్స్ కళాశాల చౌరస్తా నుంచి ైఫ్లైఓవర్ వరకు ఏసీపీ కరుణాకర్ రావు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, తహసీల్దార్ నల్ల వెంకట్రెడ్డి, ఎంపీడీవో సంపత్, వ్యవసాయాధికారి సత్యం, ఎంపీవో జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. సీఐ విజ్ఞాన్రావు, ఎస్ఐ అశోక్కుమార్, ఎంపీటీసీలు వెంగలదాసు శ్రీనివాస్, ర్యాకం మోహన్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, వార్డు సభ్యుడు వరాల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మైనార్టీ గురుకుల కళాశాలల ఆర్సీఎం అంబేద్కర్, ఏపీవో శోభ, టెక్నికల్ అధికారులు పద్మ, రాజు, విట్స్ కళాశాల, మైనార్టీ గురుకుల, గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే, చెర్లభూత్కూర్, నగునూర్, చేగుర్తి గ్రామాల్లో ఫ్రీడం రన్ నిర్వహించారు. చెర్లభూత్కూర్లో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, బుర్ర తిరుపతి, ఉపసర్పంచ్ చిట్కూరి శేఖర్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్రెడ్డి, వార్డు సభ్యులు రమేశ్, పద్మ, ఉమాదేవి, సుజాత, ఎల్లయ్య, శ్రవన్కుమార్, సంధ్య, పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ వాహిజ్, సత్యనారాయణ పాల్గొన్నారు. నగునూర్లో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య పాల్గొన్నారు. నగునూర్లోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు, కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సమత, సిబ్బంది మోహనరావు, రమాదేవి, డాక్టర్ జోసీలీనా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుర్శేడ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కోట రాజమౌళి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించగా, సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు ప్రారంభించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గోపాల్పూర్ క్రీడా మైదానంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్, సర్పంచ్ మంజుల, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, ఏఈ రమణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగులు జాతీయ పతాకాలను పట్టుకొని జాతీయ గీతాలాపన చేశారు. కరీంనగర్ జోనల్ ఈడీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంలు ఖుస్రోషాఖాన్, సుధాపరిమళ, ప్రభులత, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తన ఇంటిపై జాతీయ జెండాఎగురవేశారు.
కొత్తపల్లి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఫ్రీడం రన్ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు ఆధ్వర్యంలో కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ మీదుగా సంఘం చౌరస్తా మార్కెట్ నుంచి తిరిగి పాఠశాల వరకు చేపట్టారు. పాఠశాలలో జాతీయ గీతాలాపన చేశారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, మానుపాటి వేణుగోపాల్, గండు రాంబాబు, ఎస్కే నజీయా బాబా, చింతల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. చింతకుంటలో నిర్వహించిన ఫ్రీడం రన్ను ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ ప్రారంభించారు. చింతకుంట బస్టాండ్ నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు రన్ కొనసాగింది. ఈ రన్లో జడ్పీటీసీ కరుణ, తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్, ఎస్ఐ ఎల్లాగౌడ్, ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్, సర్పంచ్ మొగిళి మంజుల-సమ్మయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు షరీఫ్, వార్డు సభ్యులు సత్యం, చాంద్ పాషా పాల్గొన్నారు.