కరీంనగర్ కార్పొరేషన్/ముకరంపుర/ కలెక్టరే ట్, ఆగస్టు 8 : కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్, ఎంప్లాయీస్ పిలుపు మేరకు సో మవారం ఉమ్మడిజిల్లావ్యాప్తంగా నిరసన గళం వి నిపించారు. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు భద్ర త కల్పించాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ప్రైవేట్ సంస్థల దోపిడీని అరికట్టాలని, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకొని, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును నిలిపేయాలనే న్యాయమైన డిమాండ్లతో దీక్షలు చే పట్టారు. కరీంనగర్లోని ఎస్ఈ కార్యాలయం ఎ దుట విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేశారు. నల్ల చొక్కాలు ధరించి విధులు బహిష్కరించారు. టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ధర్నాలో పాల్గొని మద్దతు ప్రకటించారు. సీఐటీయూ, సీపీఎం, కాం గ్రెస్, టీడీపీ, ఎంఐఎం, రైతు సంఘం నాయకు లు సంఘీభావం తెలిపారు. అలాగే రామగుండంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రం గేట్ ఎదుట ఉ ద్యోగులు, ఇంజినీర్లు విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు.
కేంద్రం వైఖరిపై నినదించారు. జగిత్యాల, పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయాల ఎదు ట, సిరిసిల్ల సెస్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు మహాధర్నా చేశారు. సెస్ ఎండీ రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయాచో ట్ల జేఏసీ నాయకులు మాట్లాడారు. కేంద్రం నిరంకుశ ధోరణి, మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నదని వి మర్శించారు. సవరణ బిల్లుతో కరెంట్ బిల్లులు పె రగడంతోపాటు రైతులు, పేదలు, అన్ని వర్గాలపై భారం పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స వరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా 72 లక్ష ల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని, బిల్లును వెనక్కి తీసుకునేదాకా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు నిరసన కార్యక్రమా లు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపా రు. కరీంనగర్లో రాష్ట్ర జేఏసీ నాయకులు కే అం జయ్య, నరేందర్, కే శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ వీ గంగాధర్, జిల్లా జేఏసీ నాయకులు ఎన్ అంజయ్య, జీ రఘు, వీరయ్య, భాస్కర్, శ్రీనివాస్, యుగంధర్, సంపత్కుమార్, రమేశ్, స్వామి, జనార్దన్, కిరణ్, సుధీర్, ప్రకాశ్, ఫారూఖ్, సుల్తాన్వ్రి, పెద్దసంఖ్యలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.