కరీంనగర్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుక మొదలైంది. ఈ 8 నుంచి 22 దాకా 15రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా సోమవారం ఆరంభోత్సవం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొనగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రముఖులు త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. ఇంటింటికీ జెండాల పంపిణీ చేశారు. తపాలా శాఖ కరీంనగర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు. ఉద్యోగులు జాతీయ జెండా చేతబూని భారత్ మాతా జై, హర్ ఘర్ తిరంగా అంటూ నినదించారు. కరీంనగర్ హెడ్ పోస్టాఫీసు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ బంగ్లా, ఆర్టీసీ బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, వేంకటేశ్వర ఆల యం, కూరగాయల మా రెట్, టవర్ సరిల్ మీదుగా తిరిగి పోస్టాఫీసుకు ర్యాలీ తీశారు.
సర్వోదయ నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పూలమాల వేసి, నివాళులర్పించారు. అలాగే భగత్నగర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ జెండాల పంపిణీలో భాగంగా కరీంనగర్ మండలంలోని 17 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు 4389 త్రివర్ణ పతాకాలు పంపిణీ చేశారు. శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జయశ్రీ పంచాయతీ కార్యదర్శులకు జాతీయ జెండాలు అందించారు.
జగిత్యాల పోస్టల్ ఆద్వర్యంలో పట్టణంలో పోస్టల్ ఉద్యోగులు, పోస్టల్ ఏజెంట్లు జాతీయ జెండాలతో అవగాహన ర్యాలీ తీశారు. వజ్రోత్సవాల్లో భాగంగా రాయికల్ మండల కేంద్రంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం వెయ్యి జెండాలను పంపిణీ చేశారు. స్వాతంత్య్రం సిధ్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెగడపల్లిలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు 75 సంఖ్య ఆకారంలో కూర్చున్నారు. పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవి ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు.