కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్స్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు హవా కొనసాగించారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి, సత్తా చాటారు. విద్యార్థులు డీ సదాశివరెడ్డి 242వ ర్యాంకు, భూక్యా మణికంఠ 375, ఆర్ రిష్మిత 487, డీ విశ్వనాథ్రెడ్డి 577, వీ రామ్ ప్రణీత్ 597, ఎం సాత్విక్ 607, సీహెచ్. నిస్క్రాంత్ రెడ్డి 673, పీ సాయికౌశిక్ 730, పీ సాయిశరణ్ 845, పీ సిద్ధార్థ 1019, బీ నవదీప్ 1382, టీ వెంకటచరణ్రావు 1655, కే ఆర్య 1656, రూపాసింగ 2005, కేవీఎస్ఎస్ రేష్మిత 2080, సీహెచ్ రాజవిఘ్నేశ్ 2088, సీహెచ్ సుప్రీమ్ 2090, ఏ భార్గవ్రెడ్డి 2091, డీ అపూర్వ 2240 ర్యాంకులు సాధించారు. మొత్తం 28 మంది 5వేల లోపు ర్యాంకులు రాగా, 401 మంది ఐఐటీ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు అర్హత పొందారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి మాట్లాడుతూ, పటిష్ట ప్రణాళిక ప్రకారం బోధించడంతోపాటు నిరంతర పర్యవేక్షణతోనే విద్యార్థులు ఘన విజయం సాధించారని తెలిపారు. ఓవైపు కరోనా విజృంభిస్తున్నా విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ఆన్లైన్ బోధన చేశామని పేర్కొన్నారు.
అంచనాను మించి ఫలితాలు రావడం ఆన్లైన్ బోధన సక్రమంగా నిర్వహించామనేందుకు నిదర్శనమన్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ ఫ్యాకల్టీ బోధన, విద్యార్థులు నిబద్ధతను ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. సాధారణ విద్యా సంస్థలో కార్పొరేట్కు దీటుగా ఐఐటీ/నీట్ ఫలితాలు రాబడుతుండడం, విద్యార్థుల భవిష్యత్తుపై అల్ఫోర్స్ విద్యా సంస్థలు చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎన్ఐటీలో వంద మంది వరకు ఎంపిక కాబోతున్నట్లు తెలిపారు.
మంచి టీచింగ్తోనే..
చైర్మన్ సర్తో పాటు లెక్చరర్లు మంచిగా టీచింగ్ చేయడంతోనే జాతీయ స్థాయిలో ర్యాంకు తెచ్చుకున్నా. ఏరోజుకారోజు చెప్పే పాఠాలపై వెంటనే రివ్యూ చేస్తూ, అర్థం కాని పాఠ్యాంశాలు తిరిగి చెప్పడంతో పట్టు సాధించా. నిర్ధేశించుకున్న లక్ష్యం చేరుకునేందుకు లెక్చరర్లతోపాటు సిబ్బంది కూడా సహకరించారు. ముఖ్యంగా చైర్మన్ సర్ ప్రతిరోజూ మా చదువులపై వ్యక్తిగతంగా ఆరా తీస్తూ, పర్యవేక్షించడంతో నాకు 487వ ర్యాంకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మెనీ మెనీ థాంక్స్ టూ అవర్ చైర్మన్ సర్.
– ఆర్ రిష్మిత, 487వ ర్యాంకు
అల్ఫోర్స్లోనే డౌట్స్ క్లారిఫై..
సబ్జెక్టులో వచ్చే డౌట్స్ క్లారిఫై అల్ఫోర్స్ను మించిన కాలేజీ లేదు. నిత్యం సబ్జెక్ట్ బోధించిన తర్వాత అర్థం అయ్యాయో లేదో స్టూడెంట్స్ ముఖ కవళికలను బట్టే లెక్చరర్లు రియాక్టయ్యేవారు. డౌట్స్ ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే తొలగిస్తారు. తిరిగి అదే సబ్జెక్ట్ను అర్థమయ్యే వరకు చెప్పడమే అల్ఫోర్స్ విజయ రహస్యం. చైర్మన్ సర్ కూడా ప్రతి విద్యార్థితో ప్రత్యేకంగా మాట్లాడి ప్రోత్సహించేవారు. దీంతో మరింత ఉత్సాహంగా చదివాం. అందుకే నాకు 487 ర్యాంకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది.
– డీ సదాశివరెడ్డి, 242వ ర్యాంకు