కార్పొరేషన్, ఆగస్టు 8: దేశ 75 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న భారత వజ్రోత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక భగత్నగర్ చౌరస్తాల్లో జాతీయజెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్సింగ్, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఈ నెల 8 నుంచి 22 వరకు జరగబోయే వజ్రోత్సవాల్లో టీఆర్ఏస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పూర్వీకులు దేశానికి స్వాతంత్య్రం తేవడానికి ఎన్నో త్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాన్ని సాధించామన్నారు. ముందు తరాలకు స్వతంత్ర ఉద్యమం, వారి త్యాగాల గురించి తెలుపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పార్టీకి చెందిన అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా తమ తమ గ్రామాలు, మున్సిపాలిటీల్లో వేడుకలు జరిపి అందరికీ ఆదర్శంగా నిలువాలని కోరారు.
తెలంగాణచౌక్,ఆగస్టు 8: 75 వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి పిలుపు నిచ్చారు. నగరంలోని యాదవ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తిరంగా పండుగ రోజు వారీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. యాదవ మహాసభ తరఫున జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో యాదవులకు రాజకీయంగా, సామాజికంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. త్వరలోనే ప్రభ్వుతం రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. యాదవులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు యాదవుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల అభివృద్థికి నిధులవిడుదలకు సహకరించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.
వేడుకలకు బల్దియా ఏర్పాట్లు
వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మంగళవారం నుంచి నగరంలోని ప్రతి ఇంటికీ జాతీయజెండా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగర మేయర్ వై.సునీల్రావు రెండు రోజుల క్రితం అధికారులు, పాలకవర్గ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని డివిజన్లల్లో ఉత్సవాల ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు ఇంటింటికీ జెండాల పంపిణీ
ఈ ఉత్సవాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ఇళ్లకు జాతీయ జెండాలు అందించనున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు వచ్చిన జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని 65 వేల ఇళ్లకు ఈ జెండాలను అందించేందుకు డివిజన్ల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. బుధవారం చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఆయా డివిజన్లలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తిస్తున్నారు. ఆ ప్రాంతంలో గుంతలు తీయడంతో పాటు, వాటికి అవసరమైన మొక్కలు, ట్రీగార్డులను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న చేపట్టనున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి సంబంధించి ఎక్కడెక్కడ సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్న విషయంలో సర్వే చేపడుతున్నారు. ముఖ్యమైన చౌరస్తాల్లో జాతీయ గీతం పాడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 22 వరకు జరిగే ఉత్సవాల కార్యక్రమాల వారీగా బల్దియాలోని అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
గురుకుల డిగ్రీ కళాశాలలో క్రీడలు..
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నగునూర్లో సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ డీ శ్రీహరి గేమ్స్, స్పోర్ట్స్ను ప్రారంభించారు. ఈ నెల 15 వరకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెల్బాల్, హ్యాండ్ బాల్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, టగ్గాఫ్వార్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్, డిస్కస్ త్రో, రన్నింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించన్నుట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ సమత, లైబ్రేరియన్, కే మోహన్రావు, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.