హుజురాబాద్ టౌన్, నవంబర్ 22: హుజూరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు సోమవారం రాత్రి స్థానిక అంబేదర్ చౌరస్తాలో సంబురాలు అంబరాన్నంటాయి. ముందుగా పట్టణంలోని కౌశిక్రెడ్డి ఇంటి నుంచి పటాకులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ డప్పుచప్పుళ్లతో హుజూరాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కౌశిక్రెడ్డి ముఖ్య అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వీణవంక, నవంబర్ 22: ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం రాత్రి మండల కేంద్రంలో సర్పంచ్ నీల కుమారస్వామి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. బస్టాండ్ ఆవరణలో సుమారు గంట పాటు పటాకులు కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. రంగులు పూసుకొని పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. ఎమ్మెల్యీ కోటాలో పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాధవరెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, చదువు మహేందర్రెడ్డి, కాంతారెడ్డి, జనార్దన్రెడ్డి, ఓరెం భానుచందర్, తాళ్లపెల్లి మహేశ్, రవి, భిక్షపతి, గెల్లు మల్లయ్య, రాధాకృష్ణ, చైతన్య, ఓరెం శ్రీనివాస్, పంజాల సతీశ్, సంగ సమ్మయ్య, రమేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, నవంబర్ 22: ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వరరావు, నాయకులు మాట్లాడుతూ, పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, జమ్మికుంట సహకార సంఘం అధ్యక్షుడు పొనగంటి సంపత్, వార్డు కౌన్సిలర్లు వీరన్న, భిక్షపతి, రాము, సారంగం, దిడ్డి రాము, సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు చిన్ని కృష్ణారెడ్డి, రామస్వామి, మోహన్ సదానందం, రమేశ్, వెంకటేశ్, దిలీప్, భద్రయ్య, రామరాజు, స్వామి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండల కేంద్రంలో..
ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి ఎన్నిక కావడంపై టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. ఇందులో ఎంపీపీ పావని-వెంకటేశ్, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, విజయ్ కుమార్, చిన్న రాయుడు, ఓదెలు సర్పంచులు మట్ట రజిత- వాసుదేవ రెడ్డి, మొగిలి, రఫీ ఖాన్, లలిత- రాజాకొమురయ్య, సహకార సంఘం ఉపాధ్యక్షుడు కందుల కొమురెల్లి, మాజీ ఎంపీటీసీలు పెద్ది కుమార్, రాంస్వరణ్ రెడ్డి, నాయకులు మహేందర్, ప్రశాంత్, కుమార్, రాజిరెడి,్డ ఎల్లయ్య తదితరులు ఉన్నారు.