ముకరంపుర, జూలై 6: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ పదవీ కాలం రెండేళ్ల పాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్కెట్ కమిటీ చైర్మన్గా కొత్తపల్లి మండలం బావుపేట(ఆసిఫ్నగర్) గ్రామానికి చెందిన రెడ్డవేణి మధు, వైస్ చైర్మన్గా బద్దిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రాజశేఖర్ను నియమించారు. అలాగే సభ్యులుగా కార్నాటి చలమయ్య, పబ్బతి రంగారెడ్డి, గుంటి రాజమల్లు, సోమిడిరెడ్డి లక్ష్మారెడ్డి (చింతకుంట), గోలి మల్లయ్య, గంగాధర లస్మయ్య (మల్కాపూర్), గుండేటి అనిత, చంద్రపల్కల అంజయ్య, బోనాల జనార్దన్ (కమాన్పూర్), మహ్మద్ మహముద్పాషా, విజయ్కుమార్ ముందడా, వెంకటేశ్వర్లు శివనాథుని నియమితులయ్యారు. వీరితో పాటు కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ కరీంనగర్ సహాయ సంచాలకులు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సభ్యులుగా ఉన్నారు.
సంబురాలు
కొత్తపల్లి, జూలై 6: కరీంనగర్ వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్తోపాట పలువురు సభ్యలు కొత్తపల్లి మండలానికి చెందిన వారు నియమితులు కావడంతో మండలవాసులు హ ర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం బద్దిపల్లిలో యువకులు,గ్రామస్తులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టి సంబురాలు చేసుకున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
,/