మానకొండూర్, జూలై 5: నిరుపేద ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచేందుకే తెలంగాణ సర్కారు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 6గంటలకు మానకొండూర్లో పర్యటించారు. కాలినడకన వీధుల్లో తిరుగుతూ గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో తూర్పుదర్వాజ నుంచి గ్రామపంచాయతీ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు, చెరువుకట్ట వద్ద ఏర్పాటు చేసే వారసంత స్థలాన్ని పరిశీలించారు.
లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవన్నారు. సర్కారు చేస్తున్న సాయంతో ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడబిడ్డ జన్మిస్తే అదృష్టలక్ష్మి పుట్టిందనే భరోసా తల్లిదండ్రులకు కలిగిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు, నాయకులు దండు రాములు, బోడ రాజశేఖర్, ఆరెపల్లి కిరణ్, ఉండింటి శ్యాంసన్, కొమ్ము రవి, నెల్లి శంకర్, పాషా, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
తిమ్మాపూర్ రూరల్, జూలై 5: మండలంలోని నేదునూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న రెడ్డగాని మారుతి అనే యువకుడికి చికిత్స కోసం అధిక మొత్తంలో నగదు కావాల్సి ఉండగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూ.2.50లక్షల ఎల్వోసీని మంజూరు చేసి అండగా నిలిచారు. ఎల్వోసీ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మారుతి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నేదునూరి సర్పంచ్ వడ్లూరి శంకర్, ఎంపీటీసీ కొమురయ్య, ఆత్మ చైర్మన్ అశోక్రెడ్డి, గ్రామ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.