చిగురుమామిడి, జూన్ 29: గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలు నియంత్రణలోకి వస్తున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఇందుర్తి, నవాబ్పేట్ గ్రామాల్లో 46 కెమెరాలను ఏర్పాటు చేయగా, బుధవారం ఆయన కరీంనగర్ సీపీ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందుర్తి, నవాబ్పేట్ గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి, దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. నేరాల నియంత్రణలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్కు మాజీ ఎమ్మెల్యే దేశిని మల్లయ్య పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
సీపీ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటులో రాష్ట్రంలోనే చిగురుమామిడి మండలం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇందుర్తి, నవాబ్పేట్ గ్రామాల ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే, సీపీ శాలువాలతో సతరించి, జ్ఞాపికలు అందజేశారు. అలాగే, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎస్ఐ దాస సుధాకర్ను ఎమ్మెల్యే సతీశ్కుమార్, సీపీ సత్యనారాయణ, కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, సీఐ శశిధర్ రెడ్డి శాలువాతో ఘనంగా సతరించి అభినందించారు. చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్ను ఎమ్మెల్యే, సీపీ ప్రారంభించారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మారులు సాధించిన విద్యార్థులను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ టీ కరుణాకర్ రావు, తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎంపీపీ వినీత-శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సర్పంచులు అందె స్వరూప, సుద్దాల ప్రవీణ్, సన్నీళ్ల వెంకటేశం, ముప్పిడి వెంకటనర్సింహారెడ్డి, బోయిని శ్రీనివాస్, బెజ్జంకి లక్ష్మణ్, జకుల రవి, ఎంపీటీసీ అందె స్వప్న, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అందె సుజాత, మాజీ జడ్పీటీసీ అందె స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, ఇన్చార్జి ఎంపీడీవో ఖాజామొయినుద్దీన్, ఎంఈవో విజయలక్ష్మి, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.