కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 17 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ విద్యాసంస్థలు అంబేద్కర్ స్టేడియంలో ‘సంస్కృతి-2024’ పేరిట వార్షికోత్సవాన్ని వేడుకలు నిర్వహించారు.
విశిష్ట అతిథిగా డీఈవో జనార్దన్రావు, ముఖ్య అతిథిగా క్రిసాలిస్ ఫౌండర్ అండ్ సీఈవో చిత్రా రవి, పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్రెడ్డి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. వివిధ పాటలపై చేసిన నృత్యాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి.